మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం …
Read More »మాజీ ప్రధాని పీవీకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన నివాళులు
దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమనని అటవీ, పర్యావరణ, న్యాయదేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి …
Read More »పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ.
మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం సర్కిల్ నందు పివి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.పివి శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు గత ఏడాది ఖమ్మం జిల్లా కేంద్రంలో మొదటిగా …
Read More »చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ప్రత్యేక ట్రంక్ లైన్-మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్య తలెత్తకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీకి రూ.800 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. చెరువులు, ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ కోమటికుంట, పోచమ్మకుంట సుందరీకరణ పనులకు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని …
Read More »చిన్ననాటి ఫొటో పంచుకున్న మంత్రి కేటీఆర్
సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్ వేదికగా అభిమానులు, ప్రజలు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, సమస్యలను సైతం పరిష్కరిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు తన వ్యక్తిగత/కుటుంబ ఫొటోలను సైతం పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్లో షేర్ చేసిన ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. 1984లో నాలుగో తరగతి సందర్భంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో …
Read More »సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధిగా వ్యయం చేసేందుకు ప్రతి రాష్ట్ర మంత్రికి రెండు కోట్లు, ప్రతి జిల్లా కలెక్టర్కు కోటి రూపాయలను కేటాయించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.అత్యవసర సమయాల్లో వ్యయం చేయడానికి రాష్ట్ర మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఆయన …
Read More »హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం..హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ లో సామాన్య ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో GLS డెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని Dr. శేషుకుమార్, Dr. రోహిణి దంపతులు స్థాపించారు.. హన్మకొండ …
Read More »దళితులకు నాడు దగా.. నేడు ధీమా
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దళితులను రాజకీయంగా, ఓటు బ్యాంకుగా చూశారే తప్ప.. వారిని సాటి మనుషులుగా చూసిన సందర్భం లేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా దళితులకు అన్యాయమే జరిగింది. నాడు ఇక్కట్లు పడిన దళితులు స్వరాష్ట్రంలో సగర్వంగా, ఆర్థిక స్వావలంబనతో సాధికారత సాధించేలా కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పించారు. ఇందుకోసం ఏది చేయడానికైనా, ఎంత ఖర్చు చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. గత ఏడేండ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం …
Read More »మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జోగినిపల్లి సంతోష్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి మొక్కను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో కలిసి నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి …
Read More »ఎస్సీల బాధలు తొలగించే కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధం : సీఎం కేసీఆర్
సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలి. ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం …
Read More »