ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్ మెంట్ ను ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పీఆర్పీని ఆహ్వానిస్తూ అరణ్య భవన్ లో ఉద్యోగుల సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ పక్షపాతి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది గల వ్యక్తని చెప్పారు. ప్రభుత్వ …
Read More »తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. కొత్తగా 228 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 2,99,270 మంది కోలుకున్నారని చెప్పింది. 24 గంటల్లో మరో ఇద్దరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా.. మొత్తం మృతుల …
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో గాజు పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో మరో పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్ఎస్ఐఎల్ గ్రూప్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భువనగిరిలో రూ.230 కోట్లతో గాజు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్లో వెల్లడించారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సందీప్ సోమానీ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హెచ్ఎస్ఎల్ గ్రూప్ రాష్ట్రంలో ఏడోసారి పెట్టుబడి పెట్టేందుకు …
Read More »శభాష్ కేటీఆర్ – అందరూ ఫిదా
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బండలింగంపల్లి నివాసులైన చింతల విజయ్-సంగీత దంపతులు తమ కొడుకు మౌలిక్(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడు.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ …
Read More »టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులు
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం …
Read More »గోదావరి జలాలు.. విడుదల చేసిన మంత్రి హరీశ్రావు
తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు …
Read More »నర్సంపేట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు త్వరలోనే భూసేకరణ
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూములను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోని సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించామన్నారు. …
Read More »సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు: మంత్రి హరీశ్రావు
సిద్దిపేట జిల్లా గోదావరి జలాలు కూడవెళ్లి వాగులోకి వస్తాయని ఎవరూ భావించలేదని తెలంగాణ మంత్రి హరీశ్రావు అన్నారు. కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేసి హరీశ్.. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. ‘‘కూడవెళ్లి వాగుకు ఇవాళ 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. గతంలో గుక్కెడు నీటి కోసం ఘోష పడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పుష్కలంగా తాగునీటితో పాటు సాగునీరు సరఫరా అవుతోంది. …
Read More »ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శాసనసభ వేదికగా పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. రాష్ర్టంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. 30 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, …
Read More »