శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు.తనకు సహకరించిన మిత్రులకు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసి దీవించిన పట్టభద్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టభద్రులందరూ ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగపూర్తో పాటు పుణె, ఔరంగాబాద్లో కూడా బీజేపీ అభ్యర్థులను …
Read More »తెలంగాణ రాష్ర్టంలో 1201 జూనియర్ కాలేజీలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
శానసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ర్టంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్థాపనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలోని 445 మండలాల్లో విద్యాశాఖతో పాటు వివిధ సంక్షేమ శాఖలతో కలుపుకొని 1201 జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 38 ఎయిడెడ్ కాలేజీలు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూళ్లతో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మరో …
Read More »కేసీఆర్ కిట్ పథకం అద్భుతం మంత్రి ఈటల
కేసీఆర్ కిట్ పథకం కింద లబ్ధిదారుల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ పథకం వచ్చిన తర్వాత 50 శాతానికి పైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు 11,91,275 మంది మహిళలు లబ్ధి పొందారని తెలిపారు. 2016-17లో 2,09,130 మంది, 2017-18లో 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20లో 2,87,844 మంది, 2020-21(ఫిబ్రవరి) వరకు …
Read More »సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం లాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు నిధులపై స్వేచ్ఛ కల్పించామని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాలన్నారు.
Read More »సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌరవిద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కీలక …
Read More »పెన్షన్లకు కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 210 కోట్లు మాత్రమే
ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది మాత్రం కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈ డబ్బును 6 లక్షల మందికే ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల 36 వేల 521 మందికి రాష్ర్ట ప్ుభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తున్నదన్నారు. ఆసరా …
Read More »చారిత్రాత్మకంగా యాదాద్రి
యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మకంగా జరుగుతున్నదని, ఈ నిర్మాణం చేపట్టిన సీఎం కెసిఆర్, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కరోనా కష్ట కాలంలోనూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అద్దంపట్టేలా ఉందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చిరాయువుగా …
Read More »ఫలించిన ‘సోషల్’ వ్యూహం!
ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గోడరాతలు, కరపత్రాలు, పోస్టర్లు కనిపించేవి. కానీ ఇప్పుడంతా ‘నెట్టింట’ ప్రచారమే హోరెత్తుతున్నది. వ్యూహ ప్రతివ్యూహాలు, విమర్శలు.. ఎదురుదాడులు.. అంతా సోషల్ మీడియాలోనే. తాజాగా హోరాహోరీగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లోనూ సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషించింది. బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే సోషల్మీడియాను విరివిగా వాడుకుంటూ లబ్ధి పొందుతున్నది. ప్రత్యర్థులపై దాడికి, ఆరోపణలకు, విమర్శలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నది. …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ చేపట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్పై చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. నేడు సభలో పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ జరగనుంది. అనంతరం బడ్జెట్పై చర్చించనున్నారు. ఈ నెల 18న మంత్రి హరీష్ రావు బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Read More »