మరి కొద్దిసేపట్లో పెళ్లి ఉండగా.. తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు. మహబూబ్నగర్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఫిర్దోస్ బేగం పెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేశారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వధువు ఉదయం 8.30గంటలకు కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే
తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని శివ విద్యానికేతన్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటు …
Read More »జీహెచ్ఎంసీలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 46 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,257 కరోనా కేసులు నమోదయ్యా యి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలోమంత్రి కేటీఆర్ ఓటేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటేశాను. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి మద్దతుగా నిలిచాను. విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ …
Read More »టీఆర్ఎస్ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజు మంత్రి కేటీఆర్ “సర్ ప్రైజ్ గిఫ్ట్”
కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్ లోనే ఉంటూ …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 52 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో కొత్తగా 216 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇందులో 1,918 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,97,363 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 1,652కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 52 ఉన్నాయి
Read More »దండి యాత్ర అద్భుత ఘట్టం : సీఎం కేసీఆర్
స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ …
Read More »రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ర్టం సాధించాం : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పడు టీఆర్ఎస్ పార్టీకి మనీ పవర్ లేదు.. మజిల్ పవర్ లేదు.. మీడియా పవర్ లేదు.. మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట్ హరిత ప్లాజాలో తెలంగాణ జీవితం – సామరస్య విలువలపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717కు చేరింది. ఇక నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,650కు పెరిగింది. కరోనా నుంచి గురువారం రోజు 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 య్ాక్టివ్ కేసులున్నాయి
Read More »