సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న , రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ …
Read More »ధాన్యం సేకరణలో తెలంగాణకు రెండో స్థానం
2019-20 వానాకాలం ధాన్యం సేకరణలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి దాన్వే రావ్ సాహెబ్ పేర్కొన్నారు. పంజాబ్ నుంచి 162.33లక్షల టన్నుల ధాన్యం సేకరించింది.. తెలంగాణ నుంచి 111.26లక్షల టన్నులు సేకరించినట్లు తెలిపారు. ప్రతిఏటా ఈ పరిమాణం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఇంకా TSలో గడిచిన నాలుగేళ్ల కాలంలో 97,133 బోగస్ రేషన్ కార్డులు రద్దు చేసినట్లు దాన్వే వివరించారు.
Read More »విడుదలకు ముందే ఆచార్య రికార్డు
స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ,చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ‘ఆచార్య’ రఫ్పాడిస్తున్నాడు. ఈ చిత్ర రైట్స్ అక్కడ దాదాపు రూ.20 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఎలా …
Read More »తెలంగాణలో ఈ నెల 13 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సిన్
తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు …
Read More »ఈ నెల 7న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను …
Read More »రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శవంతమని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల, నల్లబెల్లి, దమ్మన్నపేట, ల్యాబర్తి, వర్ధన్నపేట గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని, రైతును రాజును చేయడమే …
Read More »తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు
తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, పెట్రోల్తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గానీ, రోడ్డు …
Read More »తెలంగాణపై పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెయిమ్ ప్రశంసలు
భారత్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెయిమ్ ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 3.7శాతం పచ్చదనాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. సోల్హెయిమ్ నార్వే అంతర్జాతీయ అభివృద్ధిశాఖ మంత్రి గా, పర్యావరణశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. …
Read More »తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ బియ్యం సరఫరాలో అమలు చేస్తున్న ఓటీపీ విధానంతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు.. పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇక ఆధార్ కు ఫోన్ నంబర్, ఐరిస్ అనుసంధాన ప్రక్రియ రేషన్ షాపుల్లోనే చేయాలని నిర్ణయించింది. దీనిపై వినియోగదారులకు అవగాహన లేక హైరానా పడుతున్నారు. మీసేవా, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. …
Read More »ప్రేమ పేరుతో నరకం
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను బలి తీసుకున్నాడు. బండి రాజు అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఓ బాలికను వేధించేవాడు. ఆమెపై అత్యాచారం చేసి.. పురుగుల మందు తాగించాడు. అనంతరం తానూ తాగాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. ప్రేమ పేరుతో నరకం చూపించాడు’ అంటూ ఆ బాలిక చివరిమాట చెప్పి ఊపిరి వదిలింది.
Read More »