Home / TELANGANA (page 447)

TELANGANA

తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా హిమా కోహ్లీ ప్ర‌మాణం

తెలంగాణ రాష్ర్ట‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లో జ‌స్టిస్ హిమా కోహ్లీ చేత‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో పాటు హైకోర్టు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం జ‌స్టిస్ హిమా …

Read More »

తెలంగాణలో మారిన వాతావరణం.. ఉదయం నుంచి జల్లులు

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండ టంతో గత కొన్నిరోజులుగా చలి వణికిస్తున్నది. అయితే నిన్నటి నుంచి మబ్బులతోపాటు పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, అక్కడక్కడ మోస్తరుగా వర్షం పడుతున్నది. మన్నార్‌ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటి వరకు ఇదే వాతావరణం …

Read More »

నిజమవుతున్న శ్రీకాంతాచారి కలలు

తెలంగాణ రాష్ట్రం వస్తేనే పడావు భూములకు పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో వలసలు బందయినయ్‌. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనయ్‌. తమ బిడ్డకు నివాళిగా గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గొల్లపల్లిని ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్‌ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. …

Read More »

జనం పాటల జజ్జనకరి జనారే.. సిరిసిల్ల శిరీష మనోగతం మీకోసం..!

మూడేండ్ల కిందట.. ఆమె ఒక సాధారణ యువతి. వాడకట్టు దోస్తులతో అచ్చెనగూళ్లో అష్టాచెమ్మో ఆడుకుంటా ముచ్చటపడే అమ్మాయి. కానీ ఇప్పుడు.. ‘సెల్ఫీ ప్లీజ్‌’ అని సెలబ్రిటీలు సైతం అడుగుతుండ్రు. ఇంతలో ఎంత మార్పు కదా? పల్లె పాటలే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టినయి. ‘అత్తగారింటికీ కొత్తగా వోతున్నా ఉయ్యాలో టుంగుటుయ్యాలో’ అంటూ తీరొక్క పాటలతో తీన్మార్‌ ఆడిస్తున్నది పల్లె పాటల ఆణిముత్యం శిరీష.  శిరీష పాట వింటే పల్లెదనం కండ్ల …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా …

Read More »

త్వరలో తెలంగాణలో 1400 మంది రేషన్‌ డీలర్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్‌ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రజలకు, రేషన్‌ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని …

Read More »

తెలంగాణలో గురు,శుక్రవారాల్లో క‌రోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ పంపి‌ణీకి ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్న‌ది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తు‌న్నట్టు ప్రజా‌రో‌గ్య‌శాఖ సంచా‌ల‌కుడు గడల శ్రీని‌వా‌స‌రావు తెలి‌పారు. వైద్యా‌రో‌గ్య‌శాఖ సిబ్బం‌దికి తొలి‌వి‌డు‌తలో ఇచ్చేం‌దుకు ఏర్పాట్లు చేసి‌నట్టు చెప్పారు. సాంకే‌తిక సమ‌స్యలు, వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీ, వ్యాక్సి‌నే‌టర్ల తయారీ తది‌తర అంశా‌లపై సన్న‌ద్ధ‌మ‌య్యేం‌దుకు గురు, శుక్ర వారాల్లో రాష్ర్ట వ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వ‌హి‌స్తు‌న్నట్టు చెప్పారు. హైద‌రా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లా‌ల్లోని ఏడు …

Read More »

తెలంగాణ‌లో కొత్త‌గా 417 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 417 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  472 మంది హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా వ‌ల్ల కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే మ‌ర‌ణించిన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410గా ఉంది.  మొత్తం రిక‌వ‌రీలు 2,81,872 మంది.  ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల …

Read More »

రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో 6,014.45 కోట్లు జమ

తెలంగాణలో యాసంగి సీజన్‌ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 120.29 లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్టు మంగళవారం పేర్కొన్నారు.

Read More »

ఖమ్మం గడ్డ టీఆర్ఎస్ అడ్డా-రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేష్ చౌదరి

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియా యాక్టివ్ కార్యకర్తల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి పార్టీ ఆఫీసు ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళి,నగర సోషల్ మీడియా కన్వీనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేశ్ చౌదరి మాట్లాడుతూ “తెలంగాణ ఏర్పడిన అన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat