భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్కు హుజుర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ విసిరారు. హుజుర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.. అదేమైందని బండి సంజయ్ అన్నారు. సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత.. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గం తలరాత మారిందని …
Read More »దుబ్బాక ఉపఎన్నిక.. ఒంటి గంట వరకు 55.52% పోలింగ్ నమోదు
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియలో భాగంగా లచ్చపేటలో రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. అక్కడ పోలింగ్ …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
తెలంగాణలో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రూ.1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు అవసరమైన నివాసానికి అవసరమైన ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి …
Read More »తెలంగాణలో కొత్తగా 1536 కరోనా కేసులు
తాజాగా హెల్త్ బులిటెన్ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కి చేరుకుంది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,351 మంది మృతి చెందారు. తెలంగాణలో …
Read More »దుబ్బాక ఉపఎన్నిక.. 11 గంటల వరకు 34.33 % పోలింగ్ నమోదు
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఓటర్లకు సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొవిడ్ బాధితులకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన …
Read More »రఘునందన్రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి
దుబ్బాకలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న రఘునందన్రావు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. భాజపా అభ్యర్థి సంబంధించి రెండుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నట్లు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి తెలిపారు. పోలింగ్ ముందు రోజు దుబ్బాకలోని చాలా గ్రామాల్లో భారీగా నగదు, మద్యం పంపిణీ జరిగే అవకాశాలున్నాయని …
Read More »ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై బీజేపీ నేతలు దాడి
మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.
Read More »దుబ్బాకలో 9 గంటల వరకు 12.74శాతం పోలింగ్
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ను సిబ్బంది ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. లచ్చపేటలోని స్ట్రాంగ్ రూమ్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
Read More »రామగుండంలో సంగీత కళాశాల ఏర్పాటు చేయండి..
రామగుండం నియోజవర్గంలో సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం, కల్చరల్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం అందించారు. రామగుండం నియోజవర్గంలో ప్రతిభ కలిగిన కలిగిన సంగీత కళాకారులున్నారని, ఈ ప్రాంతంలో సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉందని తెలిపారు. జిల్లాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంగీత కళాశాలకు …
Read More »జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు జ్యోతి ప్రజల్వన చేశారు. జ్వాలా గుత్తా అకాడమీని రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్లో ఏర్పాటు చేశారు. అద్భుతమైన సౌకర్యాలతో అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాలా గుత్తాకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎందరో యంగ్ …
Read More »