తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. మూడు రోజులుగా 1481, 1504, 1531 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగితే పండుగ సందర్భంగా వైరస్ వ్యాప్తి మొదలైనట్లు భావించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గురువారం 43,790మందికి పరీక్షలు చేయగా మొత్తం కేసుల సంఖ్య 2,37,187కు పెరిగింది. మరో ఆరుగురు మృతితో మొత్తం మరణాల సంఖ్య 1,330కు చేరింది.
Read More »ఏపీ ,తెలంగాణకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ షాక్
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలో నడుస్తున్న 72 రైళ్లకు అధికారులు త్వరలో ఉద్వాసన పలకనున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడం వంటి కారణాలతోపాటు.. ఇతర రైళ్లు, గూడ్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సీఆర్ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. ఈ రైళ్లన్నీ ఎస్సీఆర్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్, గుంతకల్లు డివిజన్లలో సుదీర్ఘకాలం సేవలందించాయి. …
Read More »రైతు బంధు వులంతా పేదరైతులే
రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులే అధికంగా లబ్ధిపొందుతున్నారు. ఈ వానకాలం సీజన్లో ప్రభుత్వం మొత్తం 57.81 లక్షల మంది రైతులకు రైతుబంధు అందజేసింది. వీరిలో సన్నకారు రైతులే (2.47 ఎకరాలలోపు భూమి ఉన్నవారు) 40.46 లక్షల మంది ఉన్నారు. ఇక చిన్నకారు రైతులు (2.48-4.94 ఎకరాలు) 11.33 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు …
Read More »నేటి నుండి రాత్రి 9.30వరకు మెట్రో రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకల సమయాన్ని అధికారులు పొడిగించారు. దీంతో నేటి నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటివరకు విరామాలతో రాత్రి తొమ్మిది గంటల వరకు రైళ్లను నడిపారు. అయితే రద్దీ పెరగడంతో రైళ్ల సమయాలను మరో అరగంట పాటు పొడిగించారు. ప్రతి మూడు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మార్చి …
Read More »ఫార్మా బ్రాండ్ హైదరాబాద్
ఫార్మారంగంలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకొనే దిశగా ముందుకు వెళ్తున్నది. తాజాగా రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం ప్రగతిభవన్లో గ్రాన్యూల్స్ ఇండి యా, లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం తాము హైదరాబాద్లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్న ట్టు వెల్లడించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో …
Read More »ఆకులు కాదు పూవ్వులే
తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలంలో రోడ్డు పక్కన ఉన్న ఈ మొక్కల ఆకులు గులాబీ వర్ణంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దూరం నుంచి చూస్తే పూల మాదిరిగా, దగ్గరికి వెళ్లి చూస్తే ఆకులని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Read More »రఘునందన్ కు మంత్రి హారీష్ రావు సవాల్
‘‘దేశంలో ఎవరింట్లో డబ్బులు దొరికినా తనవేనని బద్నాం చేస్తున్నారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అంటున్నారు. ఎవరింట్లోనో డబ్బులు దొరికితే నీకు భయమెందుకు? అక్కడికి వెళ్లి నువ్వెందుకు అతి చేశావు? దుబ్బాకలో ప్రచారం పక్కనబెట్టి సిద్దిపేట వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల చేతుల్లోంచి డబ్బులు ఎందుకు లాక్కున్నారు?’’ అని మంత్రి హరీశ్రావు.. రఘునందన్ రావును ప్రశ్నించారు. డిపాజిట్ ఓట్లు కూడా దక్కవనే ఆలోచనతో రాజకీయ సానుభూతి కోసం బీజేపీ అభ్యర్థి …
Read More »బీజేపీ పార్టీ వదంతుల పుట్ట.అబద్ధాల గుట్ట
బీజేపీ పార్టీ వందతుల పుట్ట, అబద్ధాల గుట్ట. దివాలాకోరు మాటలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. అందుకే ఏళ్ల తరబడి ఆ పార్టీలో ఉన్నవారంతా విశ్వసనీయత కలిగిన టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. ఆ పార్టీ కమిటీలన్నీ కారెక్కుతున్నాయి’’ అని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుప్రియాల్, షాపూర్, బందారం, నర్సంపేట, శేరుపల్లి, లింగాయ్పల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు టీఆర్ఎ్సలో …
Read More »మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. హైదరాబాద్లోని మూడు చోట్ల ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. …
Read More »దుబ్బాకలో బీజేపీ తరపున పవన్ ప్రచారం
నవంబర్ మూడో తారీఖున జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్రావుకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసే అంశంపై ఆ రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. పవన్ ప్రచారానికి వస్తే, తమకు మరింత అనుకూలిస్తుందని దుబ్బాక సెగ్మెంటు బీజేపీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి …
Read More »