తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »సంతోశ్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని… ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా …
Read More »తనకు కరోనా వార్తలపై ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి క్లారిటీ
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మాదేవేందర్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తప్పుడు ప్రచారం …
Read More »తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ ఇవే
అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, జూబ్లీ హిల్స్ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్ విమ్తా ల్యాబ్స్, చర్లపల్లి అపోలో హెల్త్ లైఫ్ ైస్టెల్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ, బోయినపల్లి. డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట పాత్ కేర్ ల్యాబ్లు, మేడన్చల్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ ల్యాబ్ సైన్సెస్, లింగంపల్లి మెడ్సిస్ పాత్లాబ్స్, న్యూ బోయినపల్లి యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం, సికింద్రాబాద్ బయోగ్నోసిస్ టెక్నాలజీస్, మేడ్చల్, మల్కాజిగిరి …
Read More »ఉపాధి పని కూలీలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా
ఉపాధి కూలీలకు కనీసం రూ.200 లకు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వెళ్తున్న మంత్రి మార్గ మధ్యంలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తున్నదని …
Read More »పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు
కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …
Read More »సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు సమావేశం
సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి సమావేశమయ్యారు. సిమెంట్ ధరను తగ్గించాలని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి కంపెనీల ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ సూచనలకు సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. వచ్చే వారంలో ఏ మేరకు ధర తగ్గించే విషయాన్ని తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. మరో మూడేళ్లపాటు డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వపథకాలకు రూ.230కి ఒక సిమెంట్ బస్తా ఇచ్చేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకారం తెలిపినట్లు …
Read More »రైతుకు రూ.7లక్షల కరెంటు బిల్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువగా కరెంటు బిల్లులు నమోదవుతున్న వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా వచ్చిన కరెంటు బిల్లును చూసి ఆ ఇంటి యజమాని షాకయిన సంఘటన ఇది. కేవలం మూడు బల్బులు,రెండు ఫ్యాన్లు ఉన్న ఇంటికి ఏకంగా ఏడు లక్షల కరెంటు బిల్లు వచ్చింది.రాష్ట్రంలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన రైతు శ్రీనివాస్ కు ఈ అనుభవం ఎదురైంది. ప్రతి నెల రూ.ఐదు వందలు మాత్రమే వచ్చే …
Read More »వారికి ఇంటి వద్దనే చికిత్స
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేకపోయిన లేదా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వారికి ఇంటి దగ్గరనే చికిత్వ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.. అత్యవసరమైతేనే గాంధీ ఆసుపత్రికి రావాలి.అలాంటి వారికి చికిత్స అవసరం..కరోనా కట్టడికీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లా ఆసుపత్రులల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలి..వర్షాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని ఆధికారులను …
Read More »తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 191కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరుకుంది. అయితే గడిచిన ఇరవై నాలుగంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 143కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. మొత్తం 156మంది ఇప్పటివరకు కరోనా భారీన పడి మృతి చెందారు.తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 2138గా ఉన్నాయి.మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య …
Read More »