2020 బడ్జెట్ సమగ్ర సంక్షేమ, అభివృద్ధి కాముకంగా ఉన్నదని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పట్ల ఆర్తి, కడుపునిండా ప్రేమ ఉన్న సీఎం కెసిఆర్ ముందు చూపునకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. బంగారు తెలంగాణకు బాసటగా ఈ బడ్జెట్ ఉందని ఆయన చెప్పారు. అలాగే తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖలకు …
Read More »హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు మరింత బలం చేకూర్చే విధంగా ఈరోజు బడ్జెట్ లో ప్రత్యేకంగా భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి మరియు ప్రభుత్వాని కి పురపాలక శాఖ మంత్రి కే . తారకరామారావు హైదరాబాద్ మరియు పరిసర పట్టణాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగర విస్తరణ దాని భవిష్యత్తు …
Read More »తెలంగాణ వార్షిక బడ్జెట్ – 2020-21… ఆయా రంగాలకు కేటాయింపులు ఇవే..?
రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్రావు తొలిసారిగా సభలో బడ్జెట్ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. . అన్ని …
Read More »అసెంబ్లీలో తెలంగాణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్రావు…!
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ‘బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి వ్యాఖ్యానించారు. …
Read More »సీఎం కేసీఆర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే…తమ ప్రతిభాపాటవాలతో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతూ..సమాజ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళందరికీ ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుంది. మహిళలకు యావత్ సమాజం అండగా నిలవాలి అని సీఎం …
Read More »ఆంధ్రనాట్యంతో ఆకట్టుకున్న రోజా..గవర్నర్ తమిళసై ప్రశంసలు..!
ఈ ఫొటోలో నాట్యం చేస్తున్న కళాకారిణిని గుర్తుపట్టారా.? చక్కని అభియనం.. అద్భుతమైన ముఖ వర్చస్సుతో నాట్యం చేస్తున్న ఆమె ఎవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా.. స్వతహాగా నటి కావడంతో శనివారం రవీంద్రభారతిలో లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవజనార్దన పారిజాతం శీర్షికన ఆమె ఆంధ్రనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ‘పుష్పాంజలి’ అనే అంశంపై రోజా చేసిన నాట్యం తన నృత్య పటిమను …
Read More »మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన కూతురు అమృత..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఖైరతాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందనే కోపంతో అల్లుడు ప్రణయ్ను కిరాయి హంతక ముఠాలతో మారుతీరావు చంపించాడు. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు ఇటీవల బెయిల్పై విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఇంటికి రమ్మని కూతురు అమృతపై మధ్యవర్తులతో ఒత్తిడి చేయించాడు. దీనికి …
Read More »బిగ్ బ్రేకింగ్..ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య !
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు హైదరాబాద్లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను మారుతిరావు దారుణంగా హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు అప్పటి నుంచి కూతురు …
Read More »ఈ రోజు రాత్రి 7గంటలకు టీ క్యాబినేట్ భేటీ
ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. శాసనసభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ను హరీష్రావు తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. బడ్జెట్ను 8వ తేదీన ప్రవేశపెట్టిన అనంతరం సభను …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సిఎల్పి నేత మల్లు భట్టి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగం ఆరంబించడానికి సిద్దం అయ్యారు. ఆ క్రమంలో రాజగోపాలరెడ్డి అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారు కావాలని గొడవ చేస్తున్నారని , వారు తన జవాబు వినడానికి సిద్దంగా లేరని అన్నారు. సభ్యుడిని సస్పెండ్ …
Read More »