అందాల రాక్షసి రాశీఖన్నా యాంబిషియస్ పర్సన్.. ఆమెకు ఆత్మ విశ్వాసమూ ఎక్కువే.. అందానికి ఆమె ఇచ్చే నిర్వచనం కూడా అదే! వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా కనిపించే ఆమె వృత్తి విషయంలో చాలా కఠినం… లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన రాశీఖన్నా ఆ సమయంలో ఏం చేశారు? కరోనా ఆమెకు ఏం నేర్పించింది? ఈ ఆసక్తికర విషయాలను ఆమె ABN ‘నవ్య’తో పంచుకున్నారు. రాశీఖన్నా ఎవరు? రాశీఖన్నా గురించి చెప్పడం చాలా కష్టం. …
Read More »Blog Layout
స్వయంగా వివరాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
తన పేరిట ఉన్న వ్యవసాయేతర ఆస్తులను సీఎం కేసీఆర్.. నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ వివరాలతోపాటు కేసీఆర్ ఫొటోను సిబ్బంది యాప్లో అప్లోడ్ చేశారు. అనంతరం …
Read More »తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో …
Read More »ఓటు హక్కుపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. విజయ్ తన ఆటిట్యూడ్తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని, అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థం పర్థం లేకుండా ఉందని విజయ్ …
Read More »అనుపమ మళ్లీ బిజీ బిజీ
`ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన గుర్తింపు సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్ తెలుగులో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. ఇటీవల తెలుగు తెరకు కాస్త దూరమైన అనుపమ మళ్లీ టాలీవుడ్లో సందడి చేయబోతోందట. వరుస సినిమాలతో బిజీ కాబోతోందట. తెలుగులో రెండు సినిమాలను అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడట. నిఖిల్ నటించనున్న `కార్తికేయ 2`, `18 …
Read More »యువకులే టీఆర్ఎస్ సైనికులు..
విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు టీఆరెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ , అదేవిధంగా రాయ్ పోల్ మండలం అనాజ్ పూర్, తిమ్మక్క పల్లి చెందిన బీజేపీ యువకులు పెద్ద సంఖ్యలో శనివారం టీఆరెస్ పార్టీలో చేరారు. వీరిని మంత్రి హరీష్ రావు గారు గులాబీ కండువలతో ఆహ్వానించారు. ఈ …
Read More »తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ మామునూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని …
Read More »వ్యవసాయాన్ని పండుగగా మార్చాం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే ప్రజల పండుగలను నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ప్రభుత్వమే ప్రజలకు బట్టలు అందించిన సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవని చెప్పారు. జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ తన పరిపాలనాదక్షతతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనేలా చేశారన్నారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తూ వ్యవసాయాన్ని …
Read More »కూతురి శవంతో బస్సు ఎక్కబోతే ఎక్కనియ్యలే: గంగవ్వ
జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని చవిచూసిన గంగవ్వ గుండెని రాయి చేసుకొని కాలం గడుపుతుంది . 5 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న గంగవ్వను తాగుబోతు భర్త వదిలి వెళ్లిపోయాడు. రోజు తాగొచ్చి ఆమెను కొట్టడం, మస్కట్కి పోతా డబ్బులు తీసుకురా అని వేధించడంతో ఆమె చాలా విసిగిపోయిందట. 17 ఏళ్ళకే ఆమెకు కొడుకు పుట్టడం, మరో రెండేళ్ళకే కూతురు పుట్టడంతో కష్టాలు మరింత పెరిగాయని గంగవ్వ చెప్పుకొచ్చింది. నా భర్త …
Read More »దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం!
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించనున్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం కేటాయించింది. ఈమేరకు టీఆర్ఎస్ అధ్యక్షుడికి కేంద్ర హౌసింగ్, పట్టణ మంత్రిత్వ శాఖ అధికారి దీన్దయాళ్ లేఖను పంపారు. స్థలం కేటాయింపు పూర్తయిన నేపథంలో టీఆర్ఎస్ …
Read More »