బుద్ధా వెంకన్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు అయిన ఈ టీడీపీ ఎమ్మెల్సీకి నోరు తెరిస్తే బూతులే..చంద్రబాబు సీఎం జగన్ను, వైసీపీ నేతలను ఏదైనా టాపిక్పై తిట్టాలని అనుకుంటే వెంటనే బుద్ధా వెంకన్న రంగంలోకి దిగిపోతాడు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బూతులతో నోరుపారేసుకుంటూ అవాకులుచెవాకులు పేలడంలో బుద్ధా వెంకన్న మాస్టర్ డిగ్రీనే చదివారు. బెజవాడ రాజకీయాల్లో బుద్ధా వెంకన్న అంటే తెలియనవారు ఉండరూ..కాల్మనీ సెక్స్ రాకెట్లో ఈయనగారి పేరు …
Read More »TimeLine Layout
March, 2020
-
15 March
సోషల్ మీడియాలో అతి చేస్తే చర్యలు తప్పవు-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. ఎవరు భయపడాల్సినవసరం లేదు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ సోకుతుంది. ఇక్కడున్నవారికి అది సోకకుండా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” సోషల్మీడియాలో కొందరు అతిగాళ్లు కరోనా వైరస్ గురించి తమ ఇష్టారీతిన ప్రచారంచేస్తున్నారని, అలాంటివారిపై కఠినచర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు. వారిని …
Read More » -
15 March
మార్చి 31 వరకు అన్ని మూసివేయాలి
తెలంగాణ రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మార్చి 31 వరకు మూసివేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.నిన్న శనివారం సాయంత్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఈ నిర్ణయం శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఎవరు అధిగమించినా కఠినంగా వ్యవహరిస్తామని, ఆ విద్యాసంస్థ గుర్తింపు కూడా రద్దుచేస్తామని హెచ్చరించారు. వీటితోపాటు కోచింగ్సెంటర్లు, సమ్మర్క్యాంపులు మూసివేయాలని చెప్పారు. విద్యాసంస్థలను మూసివేసినప్పటికీ, …
Read More » -
15 March
మొక్కలు నాటిన గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లో తన నివాసం లో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ గౌరవనియులైన సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహరము స్పూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం …
Read More » -
15 March
పలమనేరులో పోలీసులపై టీడీపీ మాజీ మంత్రి వీరంగం…!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రమంతటా టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం హింసాకాండ చెలరేగేలా ప్రత్యర్థులను రెచ్చగొడుతూ మరోవైపు అధికార పార్టీ వైసీపీ అరాచకం చేస్తుందంటూ బురద జల్లుతోంది. ఈ క్రమంలో తమను అడ్డుకుంటున్న పోలీసులపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పలమనేరులో టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోలీసులపై బూతులతో విరుచుకుపడ్డారు. నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేసా నా..అంటూ బూతు పదజాలంతో పోలీసులపై …
Read More » -
15 March
ఏకగ్రీవాల్లో మాచర్ల, చంద్రగిరి పోటాపోటీ
నామినేషన్లు దాఖలు అయ్యే నాటికే కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో చాలా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి నియోజకవర్గాల్లో ఎంపీటీసీల ఏకగ్రీవాలు గణనీయంగా ఉన్నాయి. చాలా ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే నామినేషన్లు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన దాఖలాలూ ఉన్నాయి. నామినేషన్ల …
Read More » -
15 March
టీడీపీకి గుడ్ బాయ్ చెప్తున్న పరిటాల కుటుంబం
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని, పట్టు కాపాడుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజకీయంగా బలంగా లేని తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు ఊహించని దెబ్బ కొడుతున్నారు. చంద్రబాబు నమ్మిన వాళ్ళే ఇప్పుడు ముంచుతున్నారు. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా పార్టీ మారడానికి పరిటాల ఫ్యామిలీ కూడా సిద్దమైంది. శ్రీరాం ఇప్పటికే జిల్లా మంత్రిని …
Read More » -
15 March
ఏపీలో 6 వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన చేస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
Read More » -
15 March
వైసీపీ హవా.. ఏకగ్రీవాల వెల్లువ.. చరిత్రలో మొదటిసారి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గం పరిధిలో ఉన్న 95 ఎంపీటీసీలకు 86 …
Read More » -
15 March
ఏపీలో వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ …
Read More »