ఏపీలో దశలవారీగా మద్యనిషేదం అమలు చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.అంతే కాదు మద్యం రేట్లు భారీగా పెంచారు. మద్యం అమ్మే సమయాలను కూడా కుదించారు. మద్యం రేట్లు భారీగా పెరగడంతో కొందరు మద్యం ప్రియులు క్రమంగా తాగుడు అలవాటును మానుకుంటున్నారు. రెగ్యులర్గా ఫుల్బాటిల్ ఎత్తనిదే నిద్రపట్టని మందుబాబులు కూడా మితంగా …
Read More »TimeLine Layout
February, 2020
-
21 February
అసదుద్దీన్ ఒవైసీ సాక్షిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే…కేసు నమోదు..!
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆందోళనలు క్రమేణా దక్షిణ భారతదేశంలో కూడా ఊపందుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఎంఐఎం అధినేత ఒవైసీ ఎన్సార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా నిరసన గళం ఎత్తుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి …
Read More » -
21 February
విడదల రజినిపై దాడిలోబయటపడ్డ అసలు నిజం ..కారులో ఉంటే చంపేసే వాళ్లమన్న టీడీపీ గుండాలు
చిలకలూరిపేట శాసనసభ్యురాలు శ్రీమతి విడదల రజిని కారుపై టీడీపీ ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. బండరాళ్లు కత్తులు, రాడ్లుతో రెచ్చిపోయారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామంలో పురుషోత్తమ పట్టణంలో వైసీపీ కార్యకర్తలు 5 భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రభలన్నింటిని గురువారం రాత్రికి కోటప్పకొండకు చేర్చారు. ప్రభలు సురక్షితంగా కొండకు చేరేవరకు ఎమ్మెల్యే భర్త కుమారస్వామి, మరిది విడదల గోపి తదిరతులు దగ్గరుండి పర్యవేక్షించారు. రాత్రి 12 …
Read More » -
21 February
మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఏ విధంగా చేస్తే పరమశివుడు కరుణిస్తాడు..!
మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. అలాగే రోజంతా ఉపవాసం ఉంటూ..శివారాధనలో గడుపుతుంటారు. ఇక రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగారణ చేస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు, అలాగని ఏ పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా శివయ్య ఏమి అనుకోడు..ఓ చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా ఇట్టే కరుణిస్తాడు..అలాగే పంచ భక్ష పరమాన్నాలు ప్రసాదంగా …
Read More » -
21 February
ఖమ్మం జిల్లాలో అమ్మాయిలతో స్కూల్ టీచర్లు …వీడియోలు వైరల్
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వాటిని వినియోగిస్తూ, చిన్నారులకు కూడా అలవాటు చేస్తున్నారు. టీచర్లే టిక్టాక్కు బానిసల్లా వీడియోలు తీసుకుంటున్నారు. అంతేకాదు, బడిలోని– అమ్మాయిలతో కలిసి టిక్టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు. కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై …
Read More » -
21 February
బ్రేకింగ్…837 కోట్ల రుణాల ఎగవేత..టీడీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన ఆర్థికవనరులుగా నిలిచిన కీలక నేతలు బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 400 కోట్ల రుణాలు ఎగవేయడంతో బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు సదరు బ్యాంక్ పత్రికా ప్రకటన …
Read More » -
21 February
పాక్ పౌరసత్వం కావాలంటున్న డారెన్ సామీ
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పాకిస్తాన్ దేశపు పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు పాక్ సూపర్ లీగ్ ప్రాంఛైకీ పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆప్రిదీ ,పాకిస్తాన్ అధ్యక్షుడికి ఆ దరఖాస్తును అందజేశాడు. త్వరలోనే ఈ దరఖాస్తుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లభిస్తే సామీ పాకిస్తాన్ దేశస్తుడవుతాడు. అయితే పాక్ తరపున క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించిన క్రికెటర్లలో సామీ మొదటివాడవ్వడం …
Read More » -
21 February
సీఎం జగన్ కి జైకొట్టిన కర్ణాటక సీఎం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాటలో నడవనున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ ఆలోచన ప్రభావం కర్ణాటక రాష్ట్రంపై పండింది. దీంతో ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం బెంగళూరు నుండి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్తర కర్ణాటక …
Read More » -
21 February
డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న జిల్లా సహకార ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంట వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల …
Read More » -
21 February
భారీ కుంభకోణం అచ్చెన్నాయుడు జైలుకే
ఈఐఎస్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఏపీ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్ఐ స్కామ్ జరిగిందన్నారు. అక్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమన్నారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని …
Read More »