ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు ఫారుక్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ కు బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చలి వేస్తోందని చౌటుప్పల్ దగ్గర ఆగాడు. స్వెట్టర్ వేసుకుంటుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకుపై కూర్చున్న ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందగా స్నేహితునికి ఎలాంటి గాయాలు కాలేదు
Read More »విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు కరోనా రోగులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ కేర్ సెంటర్గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కొవిడ్ బాధితులు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సీపీ చెప్పారు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్లో …
Read More »ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
ఎయిర్ ఇండియా విమానానికి(IX-1344) ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్పోర్ట్ వద్ద రాత్రి 7:45 నిమిషాలకు ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భారీ వర్షం …
Read More »ప్రజా చైతన్యయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేకు జేజేలు పలికిన టీడీపీ కార్యకర్తలు..!
ఏపీలో అధికార వైసీపీ. ప్రతిపక్ష టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండున్నర నెలలుగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక వైజాగ్ ఎయిర్పోర్ట్ వద్ద చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రీసెంట్గా ప్రజా …
Read More »ఎమ్మెల్యే ఆర్కేకు తప్పిన ప్రమాదం..!
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు ఆయన ఓ వివాహానికి సంబంధించి తాడేపల్లి మండలం ఉండవల్లి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కిన ఆర్కేకు అక్కడే పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కగానే ఉన్నటుంది అది విరిగిపోయింది. దాంతో ఆయన కాలికి గాయం కావడంతో గుంటూరులోని ఆశుపత్రికి తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్ళిపోయారు. …
Read More »నదిలో పడ్డ బస్సు….24మంది మృతి
రాజస్థాన్లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 24మంది జలసమాధి అయ్యారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి మేజ్ నదిలో పడిపోయింది. బుండీ కోటలాల్ సోట్ సమీపంలోని మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40మంది ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వరుడి కుటుంబం… బంధువులతో కలిసి …
Read More »కమల్ హాసన్ మంచి దయాగుణంతో ఆ కుటుంబాలకు సాయం !
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్పేట్లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కృష్ణ (కో డైరెక్టర్), చంద్రన్(ఆర్ట్ అసిస్టెంట్), మధు(ప్రొడక్షన్ అసిస్టెంట్). …
Read More »భారతీయుడు 2 ఘటనపై నోరుమెదిపిన కాజల్..జస్ట్ మిస్ !
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్పేట్లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 10మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ ఘటన …
Read More »భారతీయుడు-2 షూటింగ్ లో భారీ ప్రమాదం.. ముగ్గురి మృతి.. 10మందికి తీవ్ర గాయాలు !
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్పేట్లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈఘటనపై కమల్ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంపై ట్విట్టర్లో ఆయన స్పందించారు. ఈ ఘటన …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం 24 మంది దుర్మరణం..30మందికి గాయాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర్మరణం చెందారు. తిరుపూర్ జిల్లా అవినాషి వద్ద KSRTC కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. …
Read More »