ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …
Read More »దేశంలో కరోనా మహాప్రళయం
దేశంలో కరోనా మహాప్రళయంగా మారుతోంది. కొత్త కేసుల సంఖ్య భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3లక్షల 15వేల కేసులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా.. ఒక్క రోజు కేసులు ఇంత ఎక్కువగా నమోదు కాలేదు. రోజువారి మరణాలు2102చేరాయి. 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసింది దేశంగా నిలిచింది భారత్. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరాయి.
Read More »అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు
Read More »గూగుల్ పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ రమ్మంది
మీడియా సంస్థల వార్తలను తమ ప్లాట్ ఫాంపై చూపిస్తున్నందుకు ఆ సంస్థలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ సానుకూలంగా స్పందించింది. అయితే కొంతకాలంగా గూగుల్, ఫేస్ బుక్ ఇందుకు నిరాకరిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని గూగుల్ తెలిపింది. అవసరమైతే ఆస్ట్రేలియాలో తమ సేవలు నిలిపేస్తామంది. ఈ క్రమంలోనే తమ బింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా మైక్రోసాఫ్ట్ తాజా ప్రకటన చేసింది
Read More »అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసిన తొలి పని ఏంటో తెలుసా..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.
Read More »అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్
అమెరికా 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వందల ఏళ్లనాటి పురాతన ఫ్యామిలీ బైబిల్ సాక్షిగా బైడెన్ ప్రమాణం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ తో ప్రమాణం చేయించగా.. బైడెన్ కంటే ముందు వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి క్లింటన్, ఒబామా, జార్జ్ బుష్ కుటుంబ సభ్యులు …
Read More »అమెరికాలో కరోన విలయతాండవం
అమెరికాలో కరోనా రెండో వేవ్ మొదలైనట్లు ఉంది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 3,976మంది కరోనా భారీన పడి మృతి చెందారు. అయితే కరోనా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. అంతకుముందు రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మంది కరోనాతో చనిపోయారు. …
Read More »అమెరికా ఉపాధ్యాక్షుడికి కరోనా టీకా
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు శుక్రవారం బహిరంగంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారని వైట్హౌస్ ప్రకటించింది. కొవిడ్ టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు టీకా తీసుకుంటున్నారని పేర్కొంది. ‘అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్ పెన్స్ టీకా భద్రత, సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ను బహిరంగంగా తీసుకుంటారు’ అని వైట్హౌస్ తెలిపింది. కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అమెరికాలో ఇటీవల కొవిడ్ …
Read More »డెక్సామీథసోన్ తీసుకున్న ట్రంప్.. ఆ డ్రగ్ ఎందుకిచ్చారు ?
డెక్సామీథసోన్ ఓ స్టెరాయిడ్ డ్రగ్. దీన్ని ట్యాబ్లెట్ లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. అయితే కోవిడ్ చికిత్స పొందుతున్న డోనాల్డ్ ట్రంప్కు ఈ డ్రగ్ను ఇచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. డెక్సామీథసోన్ డ్రగ్ ను ఎందుకు వినియోగిస్తారో పరిశీలిద్ధాం. అస్వస్థత తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే ఈ మందును వాడుతారు. అంటే ట్రంప్ ఆరోగ్యం బలహీనంగా ఉన్నట్లు అర్థం అవుతున్నది. డెక్సామీథసోన్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ వ్యవస్థ కుదుటపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను …
Read More »అమెరికా తర్వాత భారత్లోనే ‘సీరియస్’!
కొవిడ్ విజృంభణ భారత్లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో …
Read More »