తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం అయినా ఉంటుందా..? అది కూడా లేదు. అయినప్పటికీ ఇండియాలోనే యంగెస్ట్ స్టేట్ అయినా తెలంగాణ మాత్రం.. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలోనే నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు తెలంగాణ …
Read More »రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ సీఎం .. నిజమా..?
బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
Read More »బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యతను విస్మరించి, అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు. …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హారీష్ రావు లేఖ
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ …
Read More »బీజేపీ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలేదు
దేశంలో అన్ని రంగాల వార్ని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని …
Read More »అమరీందర్ సింగ్ను సీఎంగా తప్పించడంపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో వారం రోజులు మాత్రమే ఉన్న పంజాబ్లో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ అద్మీ (ఆప్) కీలక నాయకులు ఆదివారం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థులపై విమర్శలకు దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లూధియానాలో, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫరీద్కోట్లో, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అమృత్సర్లో ర్యాలీల్లో …
Read More »ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ
ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయాలు అన్నంక గెలుపోటములు ఉంటాయని.. వాటన్నిటిని సమానంగా తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ . కర్ణాటకలో వీళ్లు గెలవలేదు. కానీ పరిపాలిస్తున్నారు. మధ్యప్రదేశ్లో గెలవలేదు …
Read More »బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ వేడుకోవాలి
కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై కేంద్రాన్ని తూర్పారబట్టారు. రాష్ట్రం విద్యుత్ సంస్కరణలు అమలు చేయకుంటే.. నిధులు ఇవ్వకుండా పీఎఫ్సీ.. ఆర్ఈసీపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన మాటల్లోనే.. ‘మనకు ఉన్నటి వంటి నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్సీ ఆర్ఈసీ. రాష్ట్రానికి లోన్లు ఇస్తయ్. రాష్ట్రానికి మంచి డిసిప్లేయిన్ ఉంది కాబట్టి, లోన్లు రీపేమెంట్ మంచి ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తరు. ఆ ఇచ్చే డబ్బులు ఆపేయమని …
Read More »ప్రధాని మోదీ చెప్పేది ఒక్కటి.. చేసేది ఒక్కటి.. ప్రెస్మీట్లో CM KCR ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఒక్కటని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చిన్రు అని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. …
Read More »Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Read More »