దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం
కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది.ఈక్రమంలో యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈరోజు సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ …
Read More »రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే తనయుడు
కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …
Read More »ఈనెల 12న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల పన్నెండో తారీఖున కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 12న సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం 11వ తేదీన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చి, ఓ అధికారిక కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. సంగారెడ్డి కార్యక్రమంలో సుమారుగా 2 వేల …
Read More »మరోసారి సామాన్యుల నడ్డి విరిచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటే, ఇటు వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు మరింత భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరం అయిన వంట గ్యాస్ పై మళ్ళీ రూ.50 పెంచి సామాన్యుల నడ్డి వీరిచే కార్యక్రమాన్ని …
Read More »డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …
Read More »ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షా కు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత తర్వాత జరిగిన పరిణామాల్లో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు కూడా పడుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ‘ఖలిస్తాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందూస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు. హిందూస్థాన్ అంటే ఏంటి.. అది ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు.
Read More »నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సుబ్రమణ్యం గతేడాది సెప్టెంబరులో కామర్స్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. కాగా, పరమేశ్వరన్.. త్వరలో ప్రపంచ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More »