ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు. ఆస్తి తగాదాలతో మానసిక వేదనకు గురిచేయడంతోనే ఉమామహేశ్వరి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని …
Read More »భూ సర్వే.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు. ‘జగనన్న భూరక్ష’ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూసర్వేలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం ఉండాలని సీఎం ఆదేశించారు. మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఉండాలని.. …
Read More »వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా?: బొత్స
ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని తేల్చి చెప్పారు. టీచర్లు 8 …
Read More »బాలుడికి తన పెన్ గిఫ్ట్గా ఇచ్చేసిన జగన్.. కాస్ట్ ఎంతో తెలుసా?
వరద బాధితులను పరామర్శించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పుచ్చకాయలపేటలో వరదబాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోఅక్కడ ఉన్న నక్కా విజయలక్ష్మి 8 నెలల కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు. ఈ సమయంలో సీఎం జేబులో ఉన్న పెన్ను బాలుడు తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త కింద పడింది. వెంటనే అధికారులు ఆ పెన్ను తిరిగి …
Read More »స్కూళ్లలో బోధనకు స్మార్ట్ టీవీలు.. ప్రొజెక్టర్లు: సీఎం జగన్ ఆదేశం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్ బోధన చేపట్టాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రీ ప్రైమరీ-1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. 3వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోనూ ప్రొజెక్టర్లు పెట్టే ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు కింద పూర్తిచేసుకున్న అన్ని స్కూళ్లలో మొదటి దశ …
Read More »ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధులు: సీఎం జగన్
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ప్రతి నెలా 6 లేదా 7 సచివాలయాలు విజిట్ చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం అమరావతి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్ కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2కోట్ల నిధులు కేటాయించామని సీఎం …
Read More »ఏపీ యువకుడు.. అమెరికా క్రికెట్ టీమ్కి ఎంపిక
ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్లు ఆడిన శివకుమార్ అనే యువ ఆటగాడు అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో తొలి ఇంటర్నేషనల్మ్యాచ్ను అతడు ఆడాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన శివకుమార్.. కొంతకాలం క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు. ఏదైనా దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే కనీసం మూడేళ్లు ఆ దేశంలో నివసించాలన్నది ఐసీసీ నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవలే మూడేళ్ల …
Read More »ఏపీలో భారీ వర్షాలు.. రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పలు గ్రామాలు, కాలనీలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ పైనుంచి ఆయన పరిశీలించనున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా …
Read More »సీఎం జగన్తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..
వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్కు వచ్చిన ఆమెకు సీఎం జగన్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు. …
Read More »ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు..!
ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం …
Read More »