తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి శంకర్రావు కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయారు. 2కేసుల్లో ఆయన దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపు, మహిళను దూషించారన్న కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. అంతేకాదు.. రూ.3,500 జరిమానా విధించింది. దీంతో శంకర్రావు అక్కడికక్కడే పడిపోయారు. షాద్నగర్ నమోదైన మరో కేసును కోర్టు కొట్టివేసింది.
Read More »అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని పలు హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించాయి. నమాజ్ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఆయా సంఘాల నేతలు గురుగ్రామ్లో శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22 సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఈ నిరసనల్లో …
Read More »పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన నటుడు కృష్ణడు
ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని సమాచారం. పేకాటరాయుళ్లను మియాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు …
Read More »డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్
డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అర్మాన్ను ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నట్లు వారు పేర్కొన్నారు. అర్మాన్ కోహ్లీ ఇంటికి ఎన్సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించిన, ఆయనను అరెస్ట్ చేసిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు …
Read More »దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట
ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.
Read More »బైక్ రైడ్ చేస్తున్న రామ్, భీమ్
సినీ ప్రేక్షకులు కొన్నేళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కరోనా వలన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా నడుస్తుంది. ఎన్టీఆర్ – చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు …
Read More »ఆర్.నారాయణమూర్తి అరెస్ట్
ప్రముఖ దర్శక నిర్మాత ,నటుడు ఆర్.నారాయణమూర్తి అరెస్ట్ అయ్యారు. ఇంతకీ ఈయన అరెస్ట్ వెనుక గల కారణమేంటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలపై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతులు చలో రాజ్భవన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆర్.నారాయణమూర్తి రైతులకు తన మద్దుతుని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేనందున పోలీసులు …
Read More »RRR ని ఏ జైలుకు తరలించారో తెలుసా..?
ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అధికారులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో …
Read More »అవసరమైతే చంద్రబాబు అరెస్ట్
ఏపీ సీఐడీ అధికారులు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేస్తారని మంత్రి కొడాలి నాని అన్నారు చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని దళితులను మోసం చేసి రూ.500 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని భయపెట్టి 500 ఎకరాలను కారుచౌకగా కాజేసి ప్రభుత్వానికి అధిక ధరలు అమ్ముకున్నారని తెలిపారు. వాస్తవానికి అసైన్డ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ …
Read More »కంగనా రనౌత్ పై కేసు నమోదు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది
Read More »