తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ‘బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి వ్యాఖ్యానించారు. …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సిఎల్పి నేత మల్లు భట్టి కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగం ఆరంబించడానికి సిద్దం అయ్యారు. ఆ క్రమంలో రాజగోపాలరెడ్డి అడ్డుపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారు కావాలని గొడవ చేస్తున్నారని , వారు తన జవాబు వినడానికి సిద్దంగా లేరని అన్నారు. సభ్యుడిని సస్పెండ్ …
Read More »ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …
Read More »సీఎం జగన్ పై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చూడాలంటున్న వైసీపీ అభిమానలు
శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో …
Read More »చంద్రబాబుకు మైండ్ బ్లాక్..రాజధాని గ్రామాల్లో మారుతున్న సీన్…!
ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ అధికార వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన తర్వాత గత నెలరోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోయిన అమరావతి గ్రామాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కొన్ని గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు …
Read More »సీఎం జగన్కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్…!
అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అని, చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? అని నిలదీశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా పార్టీ సిద్దాంతం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదంటూ వాదించారు. అందరూ …
Read More »అసెంబ్లీలో బాబు, లోకేష్తో సహా టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ను బయటపెట్టిన మంత్రి బుగ్గన..!
ఏపీ అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన చంద్రబాబు, లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వివరాలను బయటపెట్టారు. అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయచ్చు అని ముందే భావించిన చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు ఇన్సైడర్ ట్రేడింగ్ కింద రైతులను మభ్యపెట్టి భూములు …
Read More »చంద్రబాబు బ్యాచ్పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రెండు రోజుల కిందట మార్షల్స్పై బాస్టర్డ్స్ అంటూ నోరుపారేసుకుంది కాగా, పైగా తనకే అవమానం జరిగింది…ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలని బుకాయించాడు. దిశ చట్టంపై మాట్లాడుతూ… వైసీపీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యేలు అరాచకం చేస్తున్నారంటూ…బాబు తీవ్ర విమర్శలు చేశాడు. ఇవాళ రివర్స్ టెండరింగ్ కాదు ప్రభుత్వం …
Read More »అసెంబ్లీలో యుద్ధవాతావరణం.. మంచి స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి బొత్స !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి. ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా …
Read More »మార్షల్స్ మీద చంద్రబాబు దౌర్జన్యంపై అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే
అసెంబ్లీలో నిన్న భద్రతా సిబ్బందిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన ప్రవర్తనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు. రోజూ తాను రావాల్సిన గేటులో కాకుండా చంద్రబాబుగారు మరో గేటులో వచ్చారు.. గేటు నంబర్ –2 ద్వారా ఆయన రావాల్సి ఉంటుంది.. గేటు నంబర్–2 ద్వారా కాకుండా కాలినడకన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వాళ్లు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్ …
Read More »