ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …
Read More »దేశంలో కొత్తగా 1225 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »చైనాలో మళ్లీ కరోనా విజృంభణ
కరోనా పుట్టినిళ్లు చైనాలో మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదవగా, అంతకుముందురోజు 1206 కేసులు రికార్డయ్యాయి. 2020లో వుహాన్లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
Read More »భారత్ లో ఫోర్త్ వేవ్ వస్తుందా…?
ప్రస్తుతం ప్రపంచాన్ని ఫోర్త్ వేవ్ గజగజ వణికిస్తోంది. అందులో భాగంగా ఇజ్రయేల్ ,సౌత్ కొరియో లాంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ పై కేంద్రం క్లారిటీచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ బీఏ.2తో దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉంది.. అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు, …
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 22,400 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 102 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా సరికొత్త వేరియంట్
కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరికొన్ని వేరియంట్లలోకి రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఓ సరికొత్త వేరియంట్ కరోనా కేసులు రెండు నమోదయ్యాయి. ఈ వేరియంట్ BA1 (ఒమిక్రాన్), BA2ల కలయిక అని ఇజ్రాయేల్ వైద్య అధికారులు చెబుతున్నారు… అయితే ప్రపంచానికి ఈ వేరియంట్ ఇంకా తెలియలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు
Read More »చైనాలో మళ్లీ లాక్ డౌన్ – వణికిస్తున్న కొత్త వైరస్
ఇప్పటికే కరోనా మూడు వేవ్ లతో అతలాకుతలం అయిన ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కొత్త వైరస్ పుట్టుకోస్తుంది చైనా నుండి. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా దేశంలో తాజాగా ఆ దేశ ప్రజలను స్టెల్త్ ఒమిక్రాన్ అనే వైరస్ వణికిస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి నిన్న మంగళవారం అత్యధికంగా 5280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే తర్వాత రోజు కేసులు రెట్టింపయ్యాయి. అయితే …
Read More »దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో 89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 4,184 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,554 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,24,20,120 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 179.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »