అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇక్కడ గురువారం ఒక్క రోజే ఏకంగా 1,09,824 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి గడిచిన వారం రోజుల్లో అమెరికాలో సగటున రోజుకు 98,518 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. అంటే వారం రోజులుగా రోజుకు సుమారు లక్ష కరోనా కేసులు రికార్డయ్యాయన్నమాట. మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే ఈ కరోనా కేసులు 277శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి …
Read More »దేశంలో తగ్గని కరోనా ఉధృతి
భారత్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,643 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 42,096 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,14,159 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య …
Read More »దేశంలో కొత్తగా 41,726 కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 42వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,726 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,12,114కు పెరిగింది. ఇందులో 3,09,74,748 మంది బాధితులు …
Read More »దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులు నిన్న 30వేలకు దిగిరాగా.. తాజాగా ఇవాళ 42వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ఇందులో …
Read More »ఈ నెల నుంచే కరోనా థర్డ్వేవ్
దేశంలో ఈ నెల నుంచే కరోనా థర్డ్వేవ్ (మూడో ఉద్ధృతి) ప్రారంభమయ్యే అవకాశమున్నదని పరిశోధకులు తెలిపారు. అక్టోబర్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా లక్షన్నర వరకు నమోదవ్వచ్చని అంచనా వేశారు. అయితే, సెకండ్వేవ్తో పోలిస్తే, థర్డ్వేవ్ తీవ్రత తక్కువేనని తెలిపారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్, ఐఐటీ కాన్పూర్కు చెందిన మణీంద్ర అగర్వాల్ మ్యాథమెటికల్ …
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.ఇందులో 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 …
Read More »దేశంలో కొత్తగా 41వేలకుపైగా కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 41వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,831 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా మరో 39,258 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,08,20,521 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 541 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,24,351కి చేరింది.ప్రస్తుతం దేశంలో 4,01,952 యాక్టివ్ కేసులున్నాయని …
Read More »డెల్టా వేరియంట్ చికెన్ పాక్స్(chickenpox) కన్నా ప్రమాదకరం
ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్(Delta variant ) కరోనా వైరస్ దడ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వైరస్ వేరియంట్.. చికెన్ పాక్స్(chickenpox) కన్నా ప్రమాదకరమన్న సంకేతాలను అమెరికా వినిపించింది. అగ్రరాజ్యానికి చెందిన అంటువ్యాధుల సంస్థ (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ఈ విషయాన్ని తెలిపింది. కరోనా వైరస్కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరరీతిలో విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయాన్ని కూడా అది చేధించగలదని, …
Read More »భారత జట్టులో కరోనా కలకలం
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కరోనా సోకి కృనాల్ పాండ్యా ఇప్పటికే ఐసోలేషన్లో ఉండగా.. కృనాల్తో సన్నిహితంగా మెలిగిన చాహల్, కృష్ణప్ప గౌతమ్లకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు కృనాల్తో సన్నిహితంగా ఉన్న హార్దిక్ పాండ్యా, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్, దీపక్ చాహర్, మనీష్ పాండే, ఇషాన్ కిషన్ ప్రస్తుతం శ్రీలంకలోనే ఐసోలేషన్లో ఉన్నారు.
Read More »పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటీవ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం పోసానితోపాటు ఆయన కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోసాని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో ఆస్పత్రిలో చేరడం వల్ల తాను నటించాల్సిన సినిమాలకు అంతరాయం ఏర్పడుతుండటంతో దర్శకనిర్మాతలకు క్షమాపణలు చెప్పారు.ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలతోపాటు …
Read More »