ప్రస్తుతం ప్రపంచాన్ని ఫోర్త్ వేవ్ గజగజ వణికిస్తోంది. అందులో భాగంగా ఇజ్రయేల్ ,సౌత్ కొరియో లాంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ పై కేంద్రం క్లారిటీచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ బీఏ.2తో దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉంది.. అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు, …
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 22,400 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 102 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?
ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో దక్షిణ కొరియాలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …
Read More »ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా సరికొత్త వేరియంట్
కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరికొన్ని వేరియంట్లలోకి రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఓ సరికొత్త వేరియంట్ కరోనా కేసులు రెండు నమోదయ్యాయి. ఈ వేరియంట్ BA1 (ఒమిక్రాన్), BA2ల కలయిక అని ఇజ్రాయేల్ వైద్య అధికారులు చెబుతున్నారు… అయితే ప్రపంచానికి ఈ వేరియంట్ ఇంకా తెలియలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు
Read More »దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో 89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »దేశంలో కొత్తగా 5,476 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,476 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 158మంది కోవిడ్ వల్ల మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 59,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 26,19,778 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More »కరోనా ఏ జంతువు నుండి వచ్చిందో తెలుసా..?
చైనా వుహాన్ నగరంలోని హ్వానాన్ చేపల మార్కెట్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని, ల్యాబ్ నుంచి కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొదటిసారి కరోనా జంతువుల నుంచి మానవులకు 2019, నవంబర్ లేదా డిసెంబర్లో వ్యాపించినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది వారాల్లో మార్పు చెందిన కొవిడ్ వైరస్లో కేసులు నమోదయ్యాయని తెలిపింది. కానీ, కచ్చితంగా ఏ జంతువు నుంచి మానవులకు సోకిందో ఆ అధ్యయనాలు నిర్ధారించలేకపోయాయి.
Read More »దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో 9,01,647 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి. 180 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో 5,14,203 మంది మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 92,472కు తగ్గింది. ఇప్పటివరకు దేశంలో 177.70 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
Read More »దేశంలో కొత్తగా 8,013 కరోనా కేసులు
దేశంలో గత వారం రోజులతో పోల్చుకుంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 దిగువకు పడిపోయింది. గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 119 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,13,843 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,23,828 …
Read More »