ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో వైజాగ్లోని ఓ దవాఖానలో చేరిన ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో చికిత్సపొందుతూ ఆదివారం సా యంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్ధం నగరంలోని పెద్దవాల్తేరు డాక్టర్స్కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాస్తవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్టౌన్ …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 74వేల కరోనా కేసులు
ప్రస్తుతందేశంలో కరోనా కేసులు ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోమారు పెరిగాయి. ఈరోజు 74 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 66 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 74,442 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య …
Read More »తెలంగాణలో 2లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. అయితే ఇప్పటి వరకూ మొత్తంగా 2,00,611కి కరోనా కేసులు చేరుకున్నాయి. మరణాల సంఖ్య మొత్తంగా 1,171కి చేరుకుంది.తాజాగా తెలంగాణలో 27,052 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ మొత్తంగా 1,72,388 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు …
Read More »తమన్నాకు కరోనా
టాలీవుడ్ హాట్ బ్యూటీ మిల్క్ భామ తమన్నాకు కరోనా పాజిటీవ్ నిర్థారణ అయినట్లు తెలుస్తుంది. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నగరంలోని వారం రోజులుగా హైటెక్ సిటీ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. గత రెండు రోజులుగా తీవ్రమైన తలనొప్పి,జ్వరంతో బాధపడుతున్న ఈ మిల్క్ …
Read More »అక్టోబర్ 15నుండి సినిమా హాల్స్ కు అనుమతి
దేశంలో అన్లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్లు, స్విమ్మింగ్ పూల్స్కు అనుమతినిచ్చింది. అయితే.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్లలో 50 శాతం సీటింగ్కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరవడంపై, విద్యార్థుల …
Read More »తెలంగాణలో కొత్తగా 2,072కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,072 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్సతో మరో 9 మంది మృతి చెందారు. తాజాగా 2,259 మంది కోలుకున్నారు. 29,447 యాక్టివ్ కేసులకు గాను 23,934 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్లో 283 నమోదవగా, కరీంనగర్లో 109, ఖమ్మంలో 92, మేడ్చల్లో 160, నల్లగొండలో 139, రంగారెడ్డిలో 161, వరంగల్ అర్బన్లో 85, సిద్దిపేటలో 78, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …
Read More »తెలంగాణలో కొత్తగా 1,378కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్-19 వైరస్ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా 1107 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం …
Read More »నేను నెగటీవ్
కోవిడ్ నిబంధనలతో షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. షూటింగ్లో పాల్గొనే ముందు కరోనా టెస్ట్లు చేయించుకుని చిత్రీకరణలో జాయిన్ అవుతున్నారు స్టార్స్. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్పుత్ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఈ టెస్ట్ నన్ను చాలా భయపెట్టింది అంటున్నారు. కరోనా టెస్ట్ చేయించుకున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు పాయల్. ‘‘కరోనా టెస్ట్ అంటే చాలా భయమేసింది. ముఖ్యంగా ఆ ముక్కులో నుంచి …
Read More »తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా కోవిడ్ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 మంది కరోనా బారినపడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని …
Read More »మాజీ సీఎంకు కరోనా
కరోనా బారినపడుతున్న ప్రమఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. నిన్న అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఐసీయూలో చేరగా, తాజాగా జార్ఖండ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఆయన శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకున్నారని, అందులో పాజిటివ్గా తేలిదని రాత్రి పోద్దుపోయిన తర్వాత ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్ష చేయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నానని …
Read More »