తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సుమారు 40వేల పరీక్షలు చేస్తున్నారు. తాజాగా ఆ సంఖ్యను లక్షకు పెంచాలని వైద్యారోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి వద్దే యాంటీజెన్ టెస్టు చేసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు 2 కోట్ల ర్యాపిడ్ …
Read More »చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ ..?
ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో లండన్ కింగ్స్ కాలేజీ దీని లక్షణాలపై అధ్యయనం చేసింది. కొన్ని సింప్టమ్స్ తెలియజేసింది. సాధారణ కోవిడ్ లక్షణాలతో పాటు.. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ కావొచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఎరుపు, దురద దద్దుర్లను గమనించాలని సూచించింది.
Read More »ఒమిక్రాన్ బారినపడి 108 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ బారినపడి 108 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో 4,70,462 ఒమిన్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యూకేలో అత్యధికంగా 2,46,780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, డెన్మార్క్ 57,125, USA 42,539, జర్మనీలో 35,529 చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించింది. కాగా దేశంలో ప్రస్తుతం 2,135 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
Read More »మహారాష్ట్రలో ఒమిక్రాన్ భయోత్పాతం
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ భయోత్పాతం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో అక్కడ 144 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒక్క ముంబైలోనే 100 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 26,538 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. రికవరీ రేటు 96.55శాతానికి తగ్గింది.
Read More »బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం
బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు రేణూ దేవీ, తారా ప్రసాద్ సహా మంత్రులు సునీల్ కుమార్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరిలకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. పంజాబ్లోను కరోనా విలయతాండవం చేస్తోంది. శిరోమణి ఆకాలిదళ్ అధ్యక్షుడు సుఖేవ్ సింగ్ ధిండా కరోనా బారిన పడ్డారు.
Read More »ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు
ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఓ మహిళతో పాటు ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులకు ఒమిక్రాన్ వచ్చింది. USA నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
Read More »అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేగుతోంది. ముంబైలోని అమితాబ్ నివాసంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిగ్ బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది జూలై 11న అమితాబ్ కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన ఇంట్లో మరోసారి …
Read More »గంగూలీ ఫ్యామిలీకి కరోనా
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఫ్యామిలీకి కరోనా సోకింది. ఆయన కుటుంబంలో నలుగురికి పాజిటివ్ గా తేలింది. వీరిలో అతని కూతురు కూడా ఉంది. అయితే వీరందరికీ తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల అందరినీ హోం ఐసోలేషన్ లోనే ఉంచారు. గంగూలీ భార్య మాత్రం నెగటివ్ వచ్చింది. ఇప్పటికే గంగూలీకి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
Read More »ఢిల్లీలో 10వేల కరోనా కొత్త కేసులు
దేశ రాజధానిలో ఈ రోజు దాదాపు 10వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం 8.3గా ఉన్న పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు. దేశం మూడో వేవ్లోకి ప్రవేశించిందన్న ఆయన.. ఢిల్లీకి మాత్రం అది ఐదో వేవ్ అని వెల్లడించారు. ఇక ప్రైవేటు 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసినట్లు …
Read More »తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9 నుంచి వచ్చే అన్ని ఆదివారాలు తమిళనాడులో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కాలేజీలు పూర్తిగా మూసివేయాలని.. థియేటర్లు 50శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ప్రభుత్వం సూచించింది. మరిన్ని ఆంక్షలు విధించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.
Read More »