Home / Tag Archives: carona test (page 46)

Tag Archives: carona test

కరోనా సోకిన వారు ఇవి తినాలి..?

మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా  లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …

Read More »

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 74,748 టెస్టులు చేయగా 14,669 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. గత 24 గంటల్లో 71 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 7,871గా ఉంది. నిన్న 6,433 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,611గా ఉంది.

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More »

పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని …

Read More »

ఆ గ్రామంలో సగం మందికి కరోనా ..!

క‌ర్ణాట‌కలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా క‌రోనా ప్ర‌బ‌లుతున్న‌ది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమ‌నహళ్లి గ్రామంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండ‌గా, ఇటీవల ఆ గ్రామంలో అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్‌ …

Read More »

మంత్రి కేటీఆర్ కు కరోనా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read More »

దేశంలో కరోనా విలయ తాండవం

దేశంలో కరోనా విలయ కొనసాగుతున్నది. రోజు రోజుకు మహమ్మారి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో 2765 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది గత 24 గంటల్లో 31,982 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.ఇందులో 2765 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. నిన్న కరోనా వల్ల మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,94,896 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read More »

మహారాష్ట్రలో 58,993 కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో 58,993 పాజిటివ్ కేసులు రాగా, 301 మంది చనిపోయారు. 45,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 32.88లక్షలను చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 5.34 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat