మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »GHMCలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »మంత్రి కొడాలి నానికి కరోనా
ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
Read More »కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర
దేశంలో కరోనా భీభత్సానికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర కరోనాతో అల్లాడిపోతుంది.రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఆ రాష్ట్రంలో ఏకంగా 40,925 కొత్త కరోనా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దాదాపు 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర నే …
Read More »తమిళనాడులో కరోనా విలయతాండవం
నిన్న మొన్నటివరకు వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాజాగా కరోనా విలయతాండవంతో అయోమయంలో పడింది ఆ రాష్ట్ర ప్రజల జీవితం.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 8,981కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఏకంగా 8మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో …
Read More »సత్యరాజ్ కి కరోనా
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నాడు. కాగా.. గత రాత్రి పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్ అందరికి సుపరిచితుడు.
Read More »పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం
పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో 173 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 125 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలారు.
Read More »స్టార్ హీరోయిన్ కి త్రిష కరోనా
స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తనకు కోవిడ్ సోకిందని ట్వీట్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే తనకు వచ్చిందని పేర్కొంది. వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నానని, దాని వల్ల మేలు జరిగిందని చెప్పింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.
Read More »దేశంలో కొత్తగా 1,41,986 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,41,986 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. 24వేల కేసులు పెరిగాయి. మహమ్మారితో మరో 285 మంది మృతి చెందారు. పాజిటివ్ రేటు ఏకంగా 9.28%కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షల 72 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ.. మొత్తం 3కోట్ల 44లక్షల మంది వైరస్ నుంచి కోలుకోగా, 4 లక్షల …
Read More »