కరోనా, లాక్డౌన్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి వచ్చే ఆదాయం రూ.52,750 కోట్ల మేర తగ్గనున్నదని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు వెల్లడించారు. రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల్లో రూ.39,608 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక …
Read More »తెలంగాణలో 1,607 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,607 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. 1,372 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 19,936 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,27,583 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ …
Read More »రూపం మార్చుకున్న కరోనా వైరస్
కరోనా వైరస్లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్ల్యాండ్ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను …
Read More »ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబుకు కరోనా
తెలంగాణ రాష్ట్రంలోనిమంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్ రిపోర్ట్లో పాజిటివ్గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో తొలిసారిగా 6,725 కరోనా కేసులు, 48 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల మార్కును దాటింది.. ప్రస్తుతం ఢిల్లీలో 3,452 కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి రానున్న చలికాలంలో ఢిల్లీలో ఒక రోజులో 14వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర …
Read More »తెలంగాణలో కొత్తగా 1,637 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 45,526 కరోనా టెస్టులు చేయగా 1,637 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరింది. ఇందులో 18,100 మంది చికిత్స తీసుకుంటుండగా, 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,357కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44,39,856 కరోనా టెస్టులు చేశారు
Read More »ఒడిశా గవర్నర్ కి కరోనా
ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ జీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. గవర్నర్తోపాటు ఆయన సతీమణి, మరో నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వారంతా భువనేశ్వర్లోని ఎస్యూఎం కోవిడ్ దవాఖానలో చేరారని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. కాగా, ఈ మధ్యకాలంలో గవర్నర్ దంపతులను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా బారినపడిన …
Read More »ఏపీలో కొత్తగా 2,886కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,401 శాంపిల్స్ను పరీక్షించగా.. 2,886 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కి పెరిగింది. తాజాగా కృష్ణాలో 448 కేసులు బయటపడగా.. తూర్పుగోదావరిలో 405, గుంటూరులో 385, చిత్తూరులో 296 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 3,623 మంది కరోనా నుంచి బయటపడగా.. మొత్తం రికవరీలు …
Read More »కరోనాపై షాకింగ్ న్యూస్
వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్లే అంటున్నారు. ఏటా చలికాలంలో పలు రకాల సీజనల్ కరోనా వైర్సలు జలుబు, దగ్గుకు కారణమవుతుంటాయని, అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతుంటాయని ఆమె తెలిపారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తున్న కరోనా …
Read More »ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 80,7,023కి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య చేరింది. 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని …
Read More »