తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
Read More »రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తరలివెళ్తున్న 1500 మంది రైతులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 1500 మంది రైతులు, టీఆరెస్ శ్రేణులు రేపు ( 11.02.18 ఆదివారం) స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్షా 20 వేల కోట్ల వ్యయం తో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్ దే..వాసుదేవ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వసతి గృహాలలో సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవికలాంగుల వసతి గృహాలలో రాత్రి పూట నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంలో నిద్ర చేశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని వికలాంగుల కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని …
Read More »ఢిల్లీకి వెళ్ళిన సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజధాని డిల్లీ కి వెళ్లారు.నిన్న సాయంత్రం ( శుక్రవారం ) హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా బయల్దేరారు.అయితే గత నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న కేసీఆర్.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో డిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం …
Read More »తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!
తెలంగాణ కుంభమేళ..ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర . ఈ జాతర గత నెల 31 నుండి ఈ నెల 3వరకు జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతరకు సుమారు కోటి మందికి పైగా దర్శించుకున్నారు.అయితే ఈ నెల 2 న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.ఈ సందర్బంగా మేడారం జాతరపై ఉపరాష్ర్టపతి వెంకయ్య …
Read More »21,000 వేతనం…ఏఎన్ఎంలకు సీఎం కేసీఆర్ తీపికబురు
ఏఎన్ఎంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీపికబురు అందించారు. యూరోపియన్ కమిషన్ కింద 2003లో నియామకమైన 710 మంది ఏఎన్ఎంలకు వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదివేలుగా అందుతున్న వేతనాన్ని రూ.21,000కు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వారి వేతనాల పెంపునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. see also : కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష….మంత్రి కేటీఆర్ కీలక పిలుపు కాగా, …
Read More »హైదరాబాద్ మహానగరాన్ని సంరక్షించుకోవాలి..సీఎం కేసీఆర్
భౌగోళికంగా విస్తరిస్తున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ( సోమవారం) ప్రగతి భవన్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్యశాఖలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా 50-60 కి.మీ విస్తీర్ణంలో లక్ష ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందని, ఆ విస్తీర్ణంలో ఫారెస్టు బ్లాక్స్ను అభివృద్ధి పరచాలన్నారు. మూసీనది రెండువైపులా రివర్ ఫ్రంట్, …
Read More »బ్రేకింగ్ : నిరుద్యోగులకు టీ సర్కార్ మరో శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గత వారం రోజులనుండి రోజుకో శుభవార్త చెప్పుతున్నది.ఇవాళ ఉదయం ( శనివారం ) హోంశాఖలో 14,177 పోలీసు ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ సాయంత్రం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 549 పోస్టులు.. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 418 టీజీటీ, 52 పీజీటీ, …
Read More »కేంద్ర బడ్జెట్ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!
2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు.ఆ వివరాలు మీ కోసం.. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, ఎన్ఐటీకి రూ.54కోట్లు, ఐఐటీకి రూ.50కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ.30 కోట్లు, ఐఐఎంకు …
Read More »మేడారంలో ఉపరాష్ట్రపతికి టీ సర్కార్ ఇవ్వనున్న ప్రత్యేక బహుమతి ఇదే
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్న( బుధవారం ) ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతర రెండేన్లు కొక్కసారి రావడంతో భక్తులు భారీ గా తరలి వస్తున్నారు.నిన్నటి వరకు సుమారు 50లక్షల వరకు దర్శించునున్నారని సమాచారం.కాగా ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఈ నేపధ్యంలో రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.ఈ …
Read More »