ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) ఇక లేరు. విజయవాడలోని తన నివాసంలో అర్ధరాత్రి గుండెపోటుతో ‘కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు పనిచేశారు. 1994-99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read More »సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి చెందారు. ఈ ఉదయం 4.30 గంటలకు ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 1974 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రంజిత్ సిన్హా గతంలో ITBP, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగానూ పనిచేశారు. ఈయన స్వస్థలం బిహార్ రాజధాని పాట్నా.
Read More »వేదం మూవీ నటుడు నాగయ్య మృతి.
వేదం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య శనివారం కన్నుమూశారు. 30కి పైగా సినిమాలలో నటించిన నాగయ్య అందరి దృష్టిని ఆకర్షించారు. గుంటూరు జిల్లా, నర్సరావు పేట సమీపంలోని దేసవరం పేట గ్రామానికి చెందిన నాగయ్యకు ఊర్లో రెండెకరాల భూమి ఉండేది. అక్కడ పని లేకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు. ఇచ్చిన డైలాగ్ని కంఠస్తం పట్టి గడగడ చెప్పడంతో అతని ప్రతిభని గుర్తించి వేదం …
Read More »మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో విషాదం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు టీడీపీకి చెందిన యువనేత మాగంటి రాంజీ(37) కన్నుమూశాడు. రాంజీ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ మృతికి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు
Read More »పూజా హెగ్డే ఇంట్లో విషాదం
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మధ్య లేదని దుఃఖ సాగరంలో మునిగింది. బామ్మ చనిపోయిందనే విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా, ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది. …
Read More »కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ (86) కన్నుమూశారు. పంజాబకు చెందిన బూటా సింగ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన బూటా సింగ్ 8 సార్లు లోక్ సభ ఎంపీగా గెలిచారు. కేంద్రంలో హోం వ్యవసాయ, రైల్వే, క్రీడలు లాంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా.. బిహార్ గవర్నర్ గా, జాతీయ SC …
Read More »బీజేపీ సీనియర్ నాయకుడు మృతి
బీజేపీ సీనియర్ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్ వికాస్ ఫౌండేషన్లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి …
Read More »ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు మృతి
ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు ఫారుక్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ కు బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చలి వేస్తోందని చౌటుప్పల్ దగ్గర ఆగాడు. స్వెట్టర్ వేసుకుంటుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకుపై కూర్చున్న ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందగా స్నేహితునికి ఎలాంటి గాయాలు కాలేదు
Read More »మంత్రి బొత్స ఇంట విషాదం
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం నెలకొన్నది.మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మరణించారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని ఆసుపత్రిలోచికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి తల్లి మరణ వార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు బొత్స కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Read More »వైసీపీ నేత మృతి
కడప జిల్లాకి చెందిన మాజీ మంత్రి వైసీపీ నేత ఖలీల్ బాషా మృతి చెందారు. అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం హైదరాబాద్ ఆపోలో హాస్పటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి మైనార్టీ శాఖ మంత్రిగా పని చేసిన ఖలీల్ బాషా, గత ఎన్నికల ముందు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ …
Read More »