తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్తో ప్రమాణం చేయించారు. మరో 34 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి స్టాలిన్ అవకాశమిచ్చారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనార్టీలకు స్థానం దక్కింది. ఇటీవల ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ డీఎంకే 133 సీట్లు గెలిచి, విజయం సాధించింది.
Read More »తమిళనాడు ఎన్నికల ఫలితాలు -సీన్ రివర్స్ -నువ్వా.. నేనా..?
తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం సీన్ రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తోంది. డీఎంకేకు పళనిస్వామి ఆధ్వర్యంలోనే అన్నాడీఎంకే గట్టిపోటీ ఇస్తోంది. రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉదయం 10.45 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం డీఎంకే కూటమి 94 స్థానాల్లో …
Read More »తమిళనాడులో గెలుపు ఎవరిది..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెలువడగా.. డీఎంకే కూటమి 50 స్థానాల్లో, AIADMK 32 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన నటుడు కమలహాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Read More »‘ఎన్నికల్లోపు డీఎంకే కూటమి ఖాళీ’
డీఎంకే ఒక ఆన్లైన్ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్ రాజు ఎద్దేవా చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్లైన్లోనే నిర్వహిస్తుందన్నారు. స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం …
Read More »డీఎంకే ఎమ్మెల్యే ఎస్. కథావరయణ్ మృతి
డీఎంకే ఎమ్మెల్యే ఎస్. కథావరయణ్(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో భారీగా పట్టుబడ్డ పాత నోట్లు..
డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి రూ 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవనశి నియోజకవర్గానికి ఇలంగో గతంలో ప్రాతినిధ్యం వహించారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూర్లో ఆనంద్కు చెందిన ప్రాంగణంలో దాచారు. డీఎస్పీ వేల్మురుగన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆదివారం రాత్రి ఆనంద్ నివాసంపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం …
Read More »రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు
సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా …
Read More »రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలనం
సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో …
Read More »శోకసంద్రంలో అభిమానులు.. కార్యకర్తలు..
మాజీ ముఖ్యమంత్రి,రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన పుదుచ్చేరి రాష్ట్ర డీఎంకే నాయకుడు ఆర్వీ జానకిరామన్ (79) ఈ రోజు సోమవారం కన్నుమూశారు. పుదుచ్చేరి రాష్ట్ర రాజకీయాల్లో డీఎంకే నాయకుడిగా కీలకపాత్ర పోషించి, ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన జానకీరామన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జానకీరామన్ మృతికి పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు. తమ అభిమాన నాయకుడు మృతిపట్ల ,అభిమానులు,కార్యకర్తలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
Read More »నన్ను ఆశీర్వదించిన ప్రతీఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..ఏపీ సీఎం జగన్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇంకా తదితర ముఖ్య నేతలు జగన్ ను అభినందించారు.ఈ మేరకు వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలియజేసారు.ఇక జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే తనకి శుభాకాంక్షలు చెప్పిన మాజీ …
Read More »