తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.
Read More »హైకోర్టుకు మాజీ మంత్రి ఈటల కుటుంబం
తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని హైకోర్టులో ఈటల రాజేందర్ భార్య, కొడుకు, జమునా హేచరీస్ పిటిషన్ వేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని, అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. ఇది నేడు విచారణకు వచ్చే అవకాశముంది.
Read More »కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో …
Read More »తెలంగాణలో లాక్డౌన్పై మంత్రి ఈటల స్పష్టత
తెలంగాణలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్లు ప్రారంభిస్తామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ర్టంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్
కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాలపై ఆరోపణలు చేయడం సరికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో 4 రాష్ర్టాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మేం కేంద్రాన్ని విమర్శించట్లేదు.. వారే …
Read More »వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్గా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడం, దీనికి తోడు అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండి ఉన్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. రోగులు ఎక్కువ ఉన్న …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు ఈ ఉదయం బయల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.
Read More »ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల
కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్కే భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్ మొదలైందని అన్నారు. సెకండ్ వేవ్లో వైరస్ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన …
Read More »జిల్లా ఆస్పత్రుల్లోనూ డయాగ్నొస్టిక్ సెంటర్లు : మంత్రి ఈటల
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ కేంద్రాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇప్పటికే ప్రమాణాల ప్రకారంగా డయాగ్నోస్టిక్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. దీనికి అదనంగా జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెండు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ల్యాబ్లలో 60 రకాల పరీక్షలు …
Read More »నిమ్స్ లో మేఘా ఆధునిక సదుపాయాలతో అంకాలజీ
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్ లో క్యాన్సర్ చికిత్స విభాగం పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన భవన, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్ …
Read More »