తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »ప్రయాణికులకు APSRTC శుభవార్త
క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …
Read More »Gas Cylinder వినియోగదారులకు షాక్
దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను రూ.266కు పెంచగా.. ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1950, …
Read More »రష్మిక అభిమానులకు శుభవార్త
హాట్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె తెలుగులో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల …
Read More »తెలంగాణ రైతాంగానికి శుభవార్త
బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. …
Read More »ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి …
Read More »TSRTC శుభవార్త
కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …
Read More »విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు వారి మీద ఆధారపడ్డ వారు.. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇన్పెషేంట్ వార్డుల్లో కొవిడ్ చికిత్స పొందితే వారికి మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్ఏఎమ్ రిజ్వీ తెలిపారు. రూ. లక్ష వరకు రీఎంబర్స్మెంట్ ఇవ్వనున్నారు. ప్రయివేటు ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన వారికే రీఎంబర్స్మెంట్ వర్తించనుంది.
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »