రానున్న ఐదేళ్లలో భారత్లో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝనన్వాలా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందన్న ట్యాగ్ సర్వే” ఆధారంగా 50 లక్షల ఐటీ కొలువులు వస్తాయని రాకేష్ అంచనా వేశారు. కొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్టుల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
Read More »హైదరాబాద్ నలుదిశలా ఐటీ-మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష లక్ష్యానికి సమీపిస్తామన్నారు. ఉప్పల్లో జెన్ ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జెన్ ప్యాక్ట్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. జెన్ ప్యాక్ట్ను వరంగల్లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.పశ్చిమ హైదరాబాద్కు దీటుగా …
Read More »1000కోట్లతో ఫియట్ భారీ పెట్టుబడి
హైదరాబాద్ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్ తన రెండో మజిలీగా హైదరాబాద్ను ఎంచుకొన్నది. ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్ సగర్వంగా ప్రకటించింది. 150 మిలియన్ అమెరికన్ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్ గ్లోబల్ హబ్ను హైదరాబాద్లో నెలకొల్పుతున్నట్టు …
Read More »ఐటీలో తెలంగాణ మేటి.. ఎందుకంటే..?
ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూడాలి.. ఉద్యోగాలు, ఉపాధి పెరగాలి.. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. ఏ ఒక్కచోటో ప్రగతి కేంద్రీకృతమై ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకే హైదరాబాద్ పశ్చిమాన కేంద్రీకృతమైన ఐటీని హైదరాబాద్ అంతటా విస్తరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ముందడుగు వేసింది. ఐటీ వికేంద్రీకరణకు ఐటీ అండ్ సీ, హైదరాబాద్ గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పెర్షన్) పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరానికి పశ్చిమ దిశలోనే …
Read More »వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతం నుంచి మరోక తీపి …
Read More »పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన
విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్నగర్కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ కారిడార్ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ …
Read More »