Home / Tag Archives: karnataka

Tag Archives: karnataka

‘ఒక్కడే మహిళను రేప్‌ ఎలా చేస్తాడు?-కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన అనుచరుడిని వెనుకేసుకురావడంతోపాటు బాధిత కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతూ కర్ణాటక కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై అమరేగౌడ అనుచరుడు సంగనగౌడ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ గత నెల కొప్పల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో.. న్యాయం చేయాలని కోరిన బాధిత కుటుంబసభ్యులతో అమరేగౌడ ‘ఒక్కడే …

Read More »

వెలుగుల దీపావళి కావాలా? దివాళా తీసిన కర్ణాటక కావాలా?

అధికారం కోసం ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్‌ రావు   విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక   ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు కాంగ్రెస్‌   ప్రభుత్వం పాతర వేస్తున్నదని, పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల్లో కూడా కోత పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ …

Read More »

కర్ణాటక అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

కర్ణాటక లో ఉన్న  మొత్తం 224 అసెంబ్లీ  స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం  224 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్థులను బరిలో  నిలుపుతూ తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన  ఆరో జాబితాను విడుదల …

Read More »

మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది.ఈక్రమంలో యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈరోజు సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ …

Read More »

Politics : ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతుంది ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే..

Politics మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ విషయం మరొకసారి వివాదాస్పదంగా మారింది దీనిపై తాజాగా మంగళవారం వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకాదశి ఉండే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. మహారాష్ట్ర తో ఉన్న సరిహద్దు వివాదంపై తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం …

Read More »

కర్ణాటక అసెంబ్లీకి ఎన్టీఆర్‌..!

ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ త్వరలో కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. నవంబర్‌ 1న బెంగళూరులో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆయనకు ఆహ్వానం పంపారు. దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తమిళనాడు నుంచి ప్రముఖ నటుడు రజనీకాంత్‌, హాజరవుతారు. పునీత్‌ …

Read More »

మందు తాగొచ్చి పాఠాలు చెప్పిన లేడీ టీచర్.. హంగామా అదుర్స్!

మద్యానికి బానిసైన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని ఉదయం పూట ఫుల్లుగా తాగి స్కూల్‌కి రావడమే కాకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పింది. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఆమెను వెంటనే సస్పెండ్ చేశారు. కర్ణాటకలోని తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగలక్ష్మమ్మ చిక్కసారంగి ప్రాథమిక పాఠశాల పాతికేళ్లగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయిదేళ్లుగా మద్యానికి బానిస అయ్యారు. నిత్యం మందు తాగి పాఠశాలకు వస్తుండేది. మద్యం మత్తులో …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది ష్పాట్ డెడ్

కర్ణాటకలో గురువారం ఉదయం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. లారీ జీపును ఓవర్ టేక్ చేయడం వల్లే ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు రాయచూరు జిల్లాకు …

Read More »

హీరో అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం

సీనియర్‌హీరో అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ (85) శనివారం చనిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అర్జున్‌ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. అర్జున్‌కు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. గతంలో లక్ష్మీదేవమ్మ మైసూర్‌లో స్కూల్‌ టీచర్‌గానూ పనిచేశారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.

Read More »

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తనస్థానంలో శికారిపుర నియోజకవర్గం నుంచి చిన్నకుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని చెప్పారు. శికారిపుర ప్రజలు అనేకసార్లు తనను గెలిపించారని.. తనను ఆదరించినట్లుగానే విజయేంద్రను కూడా ఆదరించాలని యడియూరప్ప కోరారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat