తెలంగాణలో సిద్దిపేట పట్టణంలోని సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులను కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, …
Read More »కరోనా వైరస్పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో కరోనా వైరస్పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులతో …
Read More »డీసీసీబీ, డీసీఎంఎస్ లలో టీఆర్ఎస్ విజయకేతనం
తెలంగాణ రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్లను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలవారీగా విజేతల వివరాలిలా ఉన్నాయి. – కరీంనగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్గా పింగళి రమేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్గా శ్రీకాంత్రెడ్డి, వైస్ చైర్మన్గా ఫకృద్దీన్ ఎన్నికయ్యారు. – నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్గా గొంగిడి మహేందర్రెడ్డి, వైస్ చైర్మన్గా ఏసిరెడ్డి దయాకర్రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా …
Read More »వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్లకు పోస్టింగ్లు
తెలంగాణలోవెయిటింగ్లో ఉన్న 4 గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్గా ఎం. ఆర్. ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్ రాస్కు గనులు భూగర్భ …
Read More »నా పుట్టిన రోజున వేడుకలొద్దు
తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రావొద్దని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.
Read More »గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్,టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు అని వార్తలు ఆ జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …
Read More »మంత్రి హారీష్ రావు ఆదేశాలతో కదిలిన అధికారులు
తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో,మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొంటున్నారు. పట్టణాల్లోని మురుగు కాలువలను పరిశుభ్రం చేయడమే కాకుండా పిచ్చి మొక్కలను తొలగించే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న మంత్రి సంగారెడ్డి …
Read More »మరో అద్భుతం ముంగిట కాళేశ్వరం ప్రాజెక్టు
‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను, మా చెలక ఎడారి..’ అనే ఉద్యమ గీతాన్ని పూర్తిగా మార్చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం సాక్షాత్కారానికి ముహూర్తం సమీపించింది. తలాపున పారుతున్న గంగమ్మను ఒడిసిపట్టి.. దాదాపు పది దశల్లో ఎత్తిపోసి.. తెలంగాణలోనే గరిష్ఠ ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్కు తరలించే ప్రక్రియ త్వరలో ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పంలో భాగంగా ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో ఫిబ్రవరిలోనూ …
Read More »విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డు
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత …
Read More »మూగ బాలుడుకి అండగా మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్ వైద్యం కోసం …
Read More »