తెలంగాణలో రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది.ఈ మేరకు బడ్జెట్ విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రీమియం గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుంది. 14వ తేదీ నుంచి కొత్త ప్రీమియం …
Read More »కృష్ణా, గోదావరి జలాల వాటాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ …
Read More »దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయింది
దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోలిపేట చిత్రపటానికి ఎంపీ, సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుటుంబీకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన సోలిపేట రామలింగారెడ్డి …
Read More »రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు
హైదరాబాద్ మహానగరంలోని ఫతేనగర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్డీల మురుగునీరు శుద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Read More »టీఆర్ఎస్తోనే దళితుల అభివృద్ధి
టీఆర్ఎస్తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నేతలు పాలాభిషేకం చేశారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్ణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం …
Read More »సిద్దిపేటలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను మంత్రి హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ …
Read More »తెలంగాణ రాష్ట్రఉద్యమానికి జయశంకర్ సార్ దిక్సూచి
తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత ఆచార్య జయశంకర్ ఒక దిక్సూచి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ఆచార్య జయశంకర్ సార్ మార్గదర్శనం చేసారని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన తొలి ఉద్యమంలో ఆయన పాత్ర అజరమారంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.దివంగత ఆచార్య జయశంకర్ సార్ జయంతిని …
Read More »పరిశ్రమల శాఖ పైన మంత్రి కేటీఆర్ సమీక్ష
పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు టి ఎస్ ఐఐసి కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జరిపిన కేటీఆర్, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పనిచేయాలని …
Read More »మంత్రి కేటీఆర్ చేయూత
న్యాయవిద్య అభ్యసించేందుకు సాయం చేయండంటూ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే ఓ పేద విద్యార్థినికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. పేదరికం వల్ల ఖర్చులు భరించలేకపోతున్నానంటూ చేసిన విజ్ఞప్తికి స్పందించి చదువుకు భరోసా ఇచ్చారు. ‘కేటీఆర్ సర్ నా పేరు అంతగిరి హరిప్రియ. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో నాకు బీఏ ఎల్ఎల్బీ సీట్ వచ్చింది. ఖర్చులను భరించలేం. మేము చాలా పేదవాళ్లం. మా నాన్న రోజు కూలీ. దయచేసి …
Read More »యూనివర్సిటీలకు చేయూతను అందించాలి
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.జే. రావుకు సూచించారు. గురువారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీ.సీ. ప్రొ. బీ.జే. రావు సమావేశమయ్యారు. ఆయన ఇటీవలే వీ.సీ.గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా అభివృద్ధి, విద్యా విధానంలో అమలు చేయాల్సిన నూతన విధానాలు, …
Read More »