అద్భుతమైన సంక్షేమ పథకాల ఆవిష్కరణ, అమలులోనే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వీధివ్యాపారులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ట్విట్టర్లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును …
Read More »ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు అగ్రహజ్వాలలు
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బానిస అంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు మండిపడ్డాయి. బీసీ సమాజానికి ముఖ్యంగా యాదవులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈటల గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. గురువారం యాదవులు వరంగల్అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి …
Read More »తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్బోర్డు చరిత్రలో ఫస్టియర్లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో …
Read More »పట్టణ స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాలు
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని కొందరు మహిళలు తన దృష్టికి తెచ్చారని, ఇప్పుడు పట్టణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి గ్రామంలో సీసీ ప్లాట్ఫాంలు, మినీ గోడౌన్లు నిర్మిస్తామని చెప్పారు. అభయహస్తం పథకంపై ఇటీవలనే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించిందని, …
Read More »1.20 లక్షల మందితో సీఎం కేసీఆర్ సభ
విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సభకు 1.20లక్షల మంది హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్తో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు.. సభను దిగ్విజయం చేసేందుకు …
Read More »కొవిడ్ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్
ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కొవిడ్ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్ డ్రైవ్ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను …
Read More »కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
రాయపర్తి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకాలు లేవన్నారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »కరోనా కట్టడిలో తెలంగాణ ముందు
కరోనా కట్టడిలో తెలంగాణ ముందున్నదని కేంద్ర గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 5 శాతానికి మించలేదని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 5 నుంచి 15 శాతం ఉన్న జిల్లాలు, కరోనా మరణాల సంఖ్యపై రాజ్యసభ సభ్యుడు వివేక్ కే టంఖా అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. తెలంగాణలో 2019, 2020 సంవత్సరాల్లో 1,541 కరోనా మరణాలు నమోదుకాగా, ఈ ఏడాది జనవరి …
Read More »శాసన సభ్యుడిగా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని …
Read More »ఉన్నత విద్యావంతుడు.. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచైతన్య బస్సుయాత్ర నిర్వహించారు. 2011 మార్చి 1 మౌలాలీ స్టేషన్ అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి 48 గంటల రైల్రోకోలో పాల్గొన్నారు. 2011 మార్చి 10న చరిత్రాత్మక మిలియన్ మార్చ్లో భాగస్వామి అయ్యారు. 2011 జులై 21న అమరవీరుడు యాదిరెడ్డి ఆత్మాహుతికి నిరసనగా …
Read More »