కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేనూరు హైవేపై కంటైనర్ లారీ కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కంటైనర్ హైదరాబాద్నుంచి గుజరాత్ వెళ్తుండగా.. మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్రూప్లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఆటో అదుపు తప్పి కంటైనర్ లారీ కిందకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలియరాలేదు.
Read More »