మహారాష్ట్రలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో లాక్డౌన్ సడలింపుల దిశగా ఆ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జూన్ 30 నాటికి అన్లాక్ ప్రక్రియ పూర్తవుతుందని, అయితే ఎప్పటి నుంచి అన్లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మొత్తం నాలుగు దశల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
Read More »తౌక్టే తుపాను బీభత్సం
తౌక్టే తుపాను ధాటికి బాంబే హై తీరంలో కొట్టుకుపోయిన P-305 నౌకలో 26 మంది సిబ్బంది మరణించారు. వారి మృతదేహాలను గుర్తించారు. మరో 49 మంది ఆచూకీ తెలియట్లేదు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం కొట్టుకుపోయిన ఈ నౌకను ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించారు. నౌకలో మొత్తం 261 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 186 మందిని …
Read More »మహారాష్ట్రలో కరోనా బీభత్సం
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించట్లేదు. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన కేసులు తగ్గట్లేదు.
Read More »మహారాష్ట్రలో కరోనా విజృంభణ
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజే 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ 56,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 59,970 మరణాలు సంభవించాయి.
Read More »మహారాష్ట్రలో కరోనా విలయతాండవం
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు. 53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »మహారాష్ట్రలో 58,993 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో 58,993 పాజిటివ్ కేసులు రాగా, 301 మంది చనిపోయారు. 45,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 32.88లక్షలను చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 5.34 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Read More »మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆయనపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరబ్బర్ సింగ్ ఆరోపణలు చేశారు.. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారు. కాగా ‘అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు’ కేసులో.. లంచం తీసుకోవాలని తనపై హోం మంత్రి ఒత్తిడి చేశారని …
Read More »మహారాష్ట్రలో కొత్తగా 31,643 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అక్కడ కొత్తగా 31,643 కరోనా కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518కు, మరణాల సంఖ్య కు చేరింది. అలాగే ముంబై ఒక్క చోటే 5,890 కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్
మహారాష్ట్రలో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది అక్కడ కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్తగా 35,952 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 5,504 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య-మంత్రి రాజీనామా
మహరాష్ట్రలో శివసేన నేత సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకు అందించిన రాథోడ్.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా టిక్ టాక్ స్టార్, మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్యకు సంజయ్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేశారు.
Read More »