తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత ఐదు రోజులుగా ఆయన విధులకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గోల్కొండలో నిన్న నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కరోనా కారణంగానే ఆయన పాల్గొనలేదు. దీంతో అడిషనల్ డీజీ జితేందర్ నిన్న జరిగిన కార్యక్రమాన్ని పర్య వేక్షించారు.
Read More »కరోనాను సమిష్టిగా ఎదుర్కొందాం
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకంకావాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. లాక్డౌన్ను విజయవంతంగా పాటించడంలోనూ పోలీసులకు సహకరించాలని కోరారు. గురువారం డీజీపీ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. మానవాళికి చాలెంజ్ విసిరిన కరోనాను ఓడించడంలో ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని డీజీపీ పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి విపత్తును ఎదుర్కోవడంలో అందరి కృషి, చొరవ.. పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదని, మరింత ఉత్సాహంగా పోలీసులు పనిచేసేలా సహకరించాలని …
Read More »లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్లను, ప్రయివేటు వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ను అమలు చేయడం వల్ల కరోనాను నియంత్రించొచ్చు అని …
Read More »మంత్రి కేటీర్ సమక్షంలో మెట్రో కోసం కీలక సమావేశం
మెట్రోరైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణ సౌకర్యాల మొరుగుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను అదేశించారు. ఈరోజు మెట్రో రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రవాణ శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మెట్రో రైలు కనెక్టివిటీపైన సమీక్షించారు. మెట్రోరైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో దీనికి అనుసంధానం చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి( …
Read More »మరింత కఠినంగా నిబంధనల అమలు..మంత్రి మహేందర్ రెడ్డి
రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు భద్రత నిబంధనలు మరింత కఠినంగా, తప్పకుండా పాటించి ప్రమాదాలను నివారించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ కు చెందిన శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, యువతకు హెల్మెట్ లను ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంల్లో మరణిస్తున్న వారిలో 25 – 35 …
Read More »త్వరలోనే మూడు మెట్రో కారిడార్లు పూర్తి..మంత్రి మహేందర్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో చేపట్టిన మూడు మెట్రో కారిడార్లు త్వరలోనే పూర్తై ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన “హైదరాబాద్ ఇంటర్నేనేషల్ ఆటో షో” ఐదవ ఎడిషన్ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో సేవలను ప్రారంభం నుంచి ప్రతీరోజు లక్ష మంది వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. మిగతా …
Read More »