Home / Tag Archives: nalgonda (page 2)

Tag Archives: nalgonda

బీజేపీ సర్కారుపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అగ్రహాం

ఉమ్మడి ఏపీ విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని మండలిలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని చెప్పారు. ‘వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఏపీకి ఇప్పించారు. తెలంగాణకు ఒక …

Read More »

హీరో కృష్ణం రాజు మరణం పట్ల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం

ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి తన విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు …

Read More »

కృష్ణం రాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి  కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని …

Read More »

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా తరుణ్ చుగ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్ లు నియమితులయ్యారు. తరుణ్ చుగ్ ఇంఛార్జ్, అరవింద్ మీనన్ కో ఇంఛార్జ్ గా నియమిస్తూ బీజేపీ జాతీయ  అధిష్టానం ప్రకటన జారీ చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు ఇంఛార్జ్, కో ఇంఛార్జ్లను నియమించింది. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ ను హర్యానా ఇంఛార్జ్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని పంజాబ్ ఇంఛార్జ్ నియమించింది. పశ్చిమబెంగాల్ కు బీహార్ …

Read More »

అభివృద్ది ,సంక్షేమం టీఆరెఎస్ తోనే సాధ్యం-MLA డా.సంజయ్

రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యులు ముఖీద్ గారి అధ్వర్యంలో అల్లిపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఏర్రవెని ఆశాలు మరియు వారి అనుచరులు 30 మందికి పైగా అనుచరులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే మాట్లాడుతూ భారత దేశం లో బీజేపీ,కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల కన్నా …

Read More »

ఉజ్వల భారత్‌ కోసం ఉద్యమ వీరుడు

తెలంగాణ భూమి పుత్రుడు, రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాయకుడు, నాలుగు కోట్ల ప్రజల ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నరు. కేసీఆర్‌ నేతృత్వంలో, పోరుగడ్డ తెలంగాణ వేదికగా నూతన జాతీయ రాజకీయ పార్టీ అవతరించబోతున్నది. టీఆర్‌ఎస్‌లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అవి తెలియజేసిన సమాచారం ప్రకారం అధికారమే అంతిమంగా చేసే తంత్రాలకు, పదవులే లక్ష్యంగా సాగే పంథాలకు భిన్నంగా, …

Read More »

మరికాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం మహా గణపతిని భారీ క్రేన్‌ సహాయంతో ట్రాలీ పైకి ఎక్కిస్తున్నారు. అనంతరం వెల్డింగ్‌ పూర్తిచేసి.. నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే …

Read More »

కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి గౌరవ సీఎం కేసీఆర్ గారు‌ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు …

Read More »

తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే .. ఆపార్టీ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని మధ్య పోటీ నెలకొనగా చివరకు కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ఈయన అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014, 18లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో …

Read More »

మరోసారి వార్తల్లో ఎమ్మెల్యే రాజయ్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన… స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాను రెండు కళ్ల లాంటి వాళ్లమని అన్నారు. అయితే… ఒకేవైపు చూస్తే, మరో కన్ను పోతుందని అన్నారు. ఇక కడియం ఎమ్మెల్సీగా ఎన్నికై కేవలం ఆరు నెలలే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat