ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రికార్డెడ్ గా చెప్పడం తనను నివ్వెరపోయేలా చేసిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం చట్టాలను విస్మరిస్తోందని ఆయన ఈ సందర్భంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఫోన్ నైన …
Read More »పొత్తులపై TDP అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాకినాడ పర్యటనలో బిజిబిజీగా ఉన్న ఆయన ఇవాళ అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర బాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిఉందని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం అనేది రావాలని.. దానికి తెలుగుదేశం …
Read More »మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత… మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు కాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. గోపాలకృష్ణారెడ్డి మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read More »TDP నేతలకు సీఎం జగన్ వార్నింగ్
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ను పాలించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని వైసీపీ అధినేత,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నిన్న శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఏపీలో తమ ప్రభుత్వ హాయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీకి చెందిన నేతలకు రాష్ట్రంలో …
Read More »NTR తొలి అడుగే ఓ ప్రభంజనం – TDP 40ఏళ్ళ ప్రస్థానానికి తొలి అడుగు పడింది అక్కడే..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి,తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఇటు అప్పటి ఉమ్మడి ఏపీని అటు దేశాన్ని పాలిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రస్తుతం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సాక్షిగా తెలుగు దేశం పార్టీ పెట్టనున్నట్లు ప్రకటన చేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం …
Read More »సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న గురువారం అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లము అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు …
Read More »Ap Assembly-కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Read More »పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
ఏపీలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీచేయబోయే పార్టీ అభ్యర్థి పేరును టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ …
Read More »