Home / Tag Archives: national (page 18)

Tag Archives: national

ఖతర్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవమానం

 ఖతర్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తీవ్ర అవమానానికి గురిచేశాయి.దీనికి ప్రధాన కారణం మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు . అర్ధ శతాబ్దానికి పైగా మంచి మిత్ర దేశంగా ఉన్న ఖతర్‌తో స్నేహ సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అయిన అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ …

Read More »

బాబోయ్‌.. కేరళలో ‘నోరో వైరస్‌’ కలకలం..

కేరళలో నోరో వైరస్‌ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …

Read More »

ఆప్ నేతలపై ఈడీ దాడులు

ఢిల్లీ రాష్ట్ర అధికార ఆప్ కి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిన ఆరోపణలున్న నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే గత నెల మే 30న సత్యేంద్రను సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జూన్ 9 వరకూ …

Read More »

దేశంలో కరోనా కలవరం .. ఇక మాస్కు తప్పనిసరా..?

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,518 మందికి కోవిడ్ పాజిటివ్ అని  తేలింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. 2,779 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.

Read More »

మంత్రులకు ఒడిషా సీఎం షాక్‌.. 20 మంది రాజీనామా

ఒడిషాలో రాష్ట్ర మంత్రులకు సీఎం నవీన్‌ పట్నాయక్‌ షాక్‌ ఇచ్చారు. 20 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం ఆదేశాలతోనే వారంతా రాజీనామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల తీరుతో బీజేడీ (బిజూ జనతాదళ్‌) ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందనే ఆరోపణలతో మొత్తం మంత్రివర్గమే రాజీనామా చేయాలని నవీన్‌ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవలే బీజేడీ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంది. ఐదోసారి సీఎంగా ఉన్న నవీన్‌.. వచ్చే …

Read More »

దేశంలో మంకీ ఫాక్స్‌ కలకలం.. యూపీ బాలికలో లక్షణాలు..

యూపీలో మంకీ ఫాక్స్‌ వైరస్‌ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. చేతిపై దద్దుర్లు, దురద రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. బాధిత బాలిక నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల కాలంలో ఆ బాలిక కుటుంబం ఎలాంటి విదేశీ పర్యటనలు కూడా చేయకపోయినా మంకీఫాక్స్‌ తరహా లక్షణాలు రావడంతో అక్కడ …

Read More »

నదిలో పడిపోయినా ఆర్మీ బస్సు.. 7 గురు జవాన్లు మృతి

లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ఓ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. పార్థాపూర్‌ క్యాంప్‌ నుంచి హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా టుర్టుక్‌ సెక్టార్‌ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మీ సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను హాస్పిటల్‌కు తరలించారు. 19 మంది ఆర్మీ జవాన్లు గాయపడినట్లు గుర్తించారు. వీరిలో …

Read More »

మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ షాక్‌

కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్‌ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …

Read More »

దేశంలో మరోసారి కరోనా విజృంభణ

దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. నిన్న  మంగళవారం 1,675 మందికి పాజిటివ్‌ అని తేలింది. తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర …

Read More »

మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం!

ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి. ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat