గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 278 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4,21,89,887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 176 కోట్లకు …
Read More »మరోకసారి వార్తల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
చిత్రవిచిత్ర నిర్ణయాలు, శిక్షలతో వార్తల్లో నిలిచే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి ప్రాంతంలో ఏటా కింజోంగిలియా అనే పూలమొక్కలను నాటిస్తారు. వాటి సంరక్షణకు ఇద్దరు తోటమాలీలను నియమించగా.. వాతావరణ మార్పుల వల్ల ఈఏడాది ఆ మొక్కలకు పూలు పూయలేదు.దీంతో ఆగ్రహించిన కిమ్ వారిద్దరిలో ఒకరికి 3, మరొకరికి 6 నెలల జైలుశిక్ష విధించారు.
Read More »దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 44,877 మందికి వైరస్ సోకింది. మరో 684 మంది మరణించారు. 1,17,591 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.భారత్లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 44,877 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర …
Read More »యూపీ ఎన్నికలు- మంత్రిపై కేసు నమోదు
ఉత్తర్ప్రదేశ్లోని బీజేపీ అభ్యర్థి, మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోవిడ్19 ప్రోటోకాల్ ప్రకారం బైరియా అసెంబ్లీ నియోజకవర్గంలో 144 సెక్షన్ కింద నిషేధిత ఆదేశాలు ఉన్నా.. మంత్రి స్వరూప్ వాటిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ అభ్యర్తి జై ప్రకాశ్ ఆంచల్పైన కూడా ఇదే తరహా కేసు బుక్కైంది. బీజేపీ, ఎస్పీ అభ్యర్థులు ఇద్దరూ ప్రచారం కోసం …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 58,077 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో 657 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,07,177కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 15,11,321 కరోనా టెస్టులు చేశారు.
Read More »ప్రధాని మోదీపై మంత్రి హారీష్ రావు ప్రశ్నల వర్షం ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకున్నారు. కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాయి. అయినప్పటికీ మూజువాణి ఓటుతో ఆ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ? అని నిలదీశారు.పాలక, …
Read More »దేశంలో కొత్తగా 67 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4.24 కోట్లు దాటాయి. దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరింది. ఇందులో 5,05,279 మంది బాధితులు మృతిచెందగా, 8,92,828 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. …
Read More »మొదటి నుండి తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమే
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచే.. మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా అవకాశం లభించిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఉద్యమం తీవ్రస్థాయికి చేరేంతవరకూ బీజేపీ తెలంగాణ పట్ల సానుకూలంగా లేదు. కాకినాడ తీర్మానానికి మంగళం 1998లో తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ కాకినాడలో బీజేపీ …
Read More »కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు
కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ …
Read More »దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణం -ప్రధాని మోదీ
దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్లో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ నేతలు ముంబైలో వలస కార్మికులకు ఫ్రీగా రైలు టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపిందని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. సాయం చేసిన తమను నిందిస్తారా? ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే సిగ్గు లేకుండా మాట్లాడుతారా? …
Read More »