విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …
Read More »దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ
దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి 2లక్షలకుపైగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే.. 20,071 కేసులు తక్కువగా వచ్చాయి. కరోనాతో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.43%గా ఉంది. ఇక, ఒక్క రోజులో 1,57,421 మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.. ఈ క్రమంలో దేశంలో రాష్ట్రాల వారీగా కరోనా కేసులు నమోదు ఇలా ఉంది.. మహారాష్ట్ర – 41,327 కేసులు కర్ణాటక – 34,047 కేసులు తమిళనాడు – 23,975 కేసులు కేరళ – 18,123 కేసులు గుజరాత్ – 10,150 కేసులు హర్యాణా 9,000 కేసులు ఆంధ్రప్రదేశ్ – 4,570 కేసులు గోవా – 3,232 కేసులు …
Read More »BJP కి షాకిస్తున్న అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్నటి వరకు బలంగా కనిపించిన అధికార బీజేపీకి షాకిచ్చేలా.. వలసలను ఆహ్వానిస్తూ తమ పార్టీ బలపడుతోందనే సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,మంత్రులు బీజేపీని వీడి ఎస్పీలో చేరుతున్నారు.. మరోవైపు ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఊగిసలాటలో ఉన్నారట. అఖిలేష్ దెబ్బకు …
Read More »హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్ల పెంపు 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు …
Read More »దేశంలో కొత్తగా 2,47,417 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,47,417 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 27 శాతం అధికంగా వెలుగు చూశాయి. బుధవారం 84,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగింది. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి పెరిగింది.
Read More »పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను
త్వరలో దేశంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ప్రకటించే అవకాశముంది. పంజాబ్ సీఎంగా భగవంతు చేయాలని తాను భావిస్తున్నట్లు ఆప్ అధినేత కేజీవాల్ తెలిపారు. అయితే ప్రజలే దీనిని నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం అభ్యర్థిని వారం రోజుల్లో ప్రకటిస్తానని ఇటీవల ప్రకటించారు కేజీవాల్. ఈక్రమంలో సీఎం అభ్యర్థిపై సూచన ప్రాయంగా ఒక ప్రకటన చేశారు.
Read More »జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వీలుగా జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించింది. జమ్మూలో 6, కశ్మీర్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలు, బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్లో 46, జమ్మూలో 37 అసెంబ్లీ స్థానాలున్నాయి.
Read More »ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్రకటించారు. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడానికి సంతోషిస్తున్నట్లు భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ అవార్డు ప్రకటనపై ఫేస్బుక్లో ఓ ప్రకటన చేసింది. …
Read More »ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ
ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిస్ వరల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. పోటీల నిర్వాహకులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పోటీదారులంతా మిస్ వరల్డ్ ఫినాలే జరుగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేషన్లో ఉన్నారు. కంటెస్టెంట్లలో కరోనా పాజిటివ్ …
Read More »