టిక్టాక్ విషయంలో అమెరికాలో నెలకొన్న సస్పెన్స్కు తెరపడినట్టే కనిపిస్తోంది! టిక్టాక్ను కొనుగోలుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆదివారం నాడు ప్రకటించింది. సెప్టెంబర్ 15 కల్లా ఇందుకు సంబంధించిన చర్చలన్నీ పూర్తి చేస్తామని తెలిపింది. టిక్టాక్ కొనుగోలు చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ఈ డీల్ విషయమై మైక్రోసాఫ్ట్ …
Read More »ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
Read More »అయోధ్యలో భూమిపూజ పూజారికి కరోనా
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కోసం విధులు నిర్వర్తించే పోలీసులు, పూజారులకు కరోనా వైరస్ పరీక్షలు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భద్రత కల్పించే 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
Read More »60వేలకు దగ్గరలో బంగారం
అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం సోమవారం ఏకంగా రూ.820 పెరిగి రూ.54,300కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.730 పెరిగి రూ.49,780కి చేరింది. అటు కిలో వెండి ధర ఏకంగా రూ.3,490 పెరిగి రూ.64,700కి చేరింది.
Read More »కరోనా కేసుల్లో ఏపీకి 4వ స్థానం
ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,02,349 కరోనా కేసులు నమోదయ్యాయి.. కేసుల సంఖ్యాపరంగా దేశంలో నాలుగో స్థానాన్ని ఏపీ చేరుకుంది. ఇక రోజువారీ కేసుల వృద్ధిపరంగా ఏపీ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 60 శాతం కరోనా కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. అటు కేసుల డబ్లింగ్ లో ఏపీ తొలి స్థానంలో ఉంది.
Read More »కరోనా భయంతో యువతిని
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో బస్సులో నుంచి ఓ యువతిని(19) బయటకు డ్రైవర్ తోసేసిన ఘటన గత నెల 15వ తేదీన చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఢిల్లీ నుంచి UP వెళ్తుండగా యువతి స్వల్ప అస్వస్థతకు గురైంది. అయితే బస్సు డ్రైవర్ కరోనా భయంతో ఆమెను కిందకు తోసేయగా అక్కడికక్కడే మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత …
Read More »ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
మహారాష్ట్రలో 5,134 కరోనా కేసులు.. మొత్తం 2.17లక్షలు తమిళనాడులో 3,616 కరోనా కేసులు.. మొత్తం 1.18లక్షలు ఢిల్లీలో 2,008 కరోనా కేసులు.. మొత్తం 1.02 లక్షలు కర్ణాటకలో 1,498 కరోనా కేసులు.. మొత్తం 26,815 గుజరాత్లో 778 కరోనా కేసులు.. మొత్తం 37,636 మధ్య ప్రదేశ్ లో 343 కరోనా కేసులు.. మొత్తం 15,627 కేరళలో 272 కరోనా కేసులు.. మొత్తం 5894..
Read More »సీనియర్ నటి, ఎంపీ సుమలతకు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాండ్య MP సుమలత కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఎంపీగా ఉన్న ఆమె.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆమె. …
Read More »80 కోట్ల మందికి ఉచిత రేషన్
దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్ కల్యాణ్ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల …
Read More »దేశంలో అదుపులోనే కరోనా
ప్రధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్లాక్-2 దశలోకి ప్రవేశించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చే మాసంలోకి కూడా ఎంటర్ అయ్యామన్నారు. ఇలాంటి సందర్భంలో దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా మృతుల నివారణలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. లాక్డౌన్ సరైన సమయంలో చేపట్టడం, ఇతర నిర్ణయాల …
Read More »