Home / Tag Archives: News (page 4)

Tag Archives: News

ఐపీఎల్‌కు భారీ షాక్‌.. వార్నర్‌, స్మిత్ కూడా గుడ్‌బై!

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజ‌న్ క‌ళ త‌ప్ప‌నుందా? ఇప్ప‌టికే ఒక్కొక్క‌రుగా ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ లీగ్‌ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్స్ డేవిడ్ వార్న‌ర్, స్టీవ్ స్మిత్ కూడా తిరిగి వెళ్లిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవ‌కాశం ఉన్న‌దన్న వార్త‌ల నేప‌థ్యంలో అంత‌కుముందే ఇంటికి వెళ్లిపోవాల‌ని ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆర్సీబీ నుంచి …

Read More »

దేశంలో కొత్తగా 59,118 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,26,652కు చేరింది. అటు నిన్న కరోనాతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలను దాటింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి

Read More »

దేశంలో తగ్గని కరోనా తీవ్రత

ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇంత మొత్తంలో కేసులు నమోదవడం తొలిసారిగా.. మళ్లీ 133 రోజుల తర్వాత కొవిడ్‌ కేసులు అత్యధికంగా రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,17,87,534కు …

Read More »

తగ్గిన బంగారం ధరలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.45,930కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.42,100గా ఉంది. ఇక వెండి కేజీపై రూ.1000 తగ్గి రూ.71,500గా ఉంది

Read More »

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2021 – ‘పీపుల్స్ పల్స్’ సర్వే నివేదిక:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్ లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, …

Read More »

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబంలో విషాదం

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం – సోదరుడు కన్నుమూశారు. కలాం పెద్దన్నయ్య మహ్మద్ ముత్తుమీరా(104) రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముత్తుమీరా మృతికి తెలంగాణ గవర్నర్ తమిళి సై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …

Read More »

మోసపోయిన ఢిల్లీ సీఎం కూతురు

సైబర్ నేరగాడి చేతిలో ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత మోసపోయింది. ఓ ఈ కామర్స్ సైట్లో పాత సోఫాను అమ్మకానికి పెట్టగా, ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే తాను ఇవ్వాల్సిన మొత్తం అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుందని నమ్మించాడు. అలా చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. అది తప్పు కోడ్ అని, సరైన కోడ్ …

Read More »

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసిన తొలి పని ఏంటో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.

Read More »

ఒకే మండపంలో తల్లీకూతుళ్ల పెళ్లి

తోబుట్టువులు, స్నేహితులు ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కానీ UP గోరఖ్ పూర్ జిల్లాలో మాత్రం తల్లీకూతుళ్లు ఒకే వేదికపై వివాహాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం షిప్రాలి గ్రామంలో ‘ముఖ్యమంత్రి సాముహిక్ వివాహ్ యోజన’ కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో బేలాదేవి(53) జగదీశ్(55) అనే వ్యక్తిని పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కూమార్తె ఇందు(27)కు వివాహమైంది. ప్రస్తుతం ఈ జంట వివాహాలు చర్చనీయాంశమయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat