ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో ప్రముఖనటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …
Read More »