Home / Tag Archives: rahul gandhi (page 6)

Tag Archives: rahul gandhi

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్‌ స్కామ్‌లో ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ నరేష్‌ కుమార్‌ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి సంబంధించిన నివేదికను పంపారు. ఒక ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కోసం ప్రభుత్వానికి చెందిన ఐఎల్‌బీఎస్‌ దవాఖాన నుంచి సీఎస్‌ నరేష్‌ కుమార్‌ కుమారుడు కరణ్‌ చౌహాన్‌కు చెందిన మెటామిక్స్‌ కంపెనీ ఎలాంటి …

Read More »

వెలుగుల దీపావళి కావాలా? దివాళా తీసిన కర్ణాటక కావాలా?

అధికారం కోసం ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్‌ రావు   విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక   ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు కాంగ్రెస్‌   ప్రభుత్వం పాతర వేస్తున్నదని, పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల్లో కూడా కోత పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ …

Read More »

ఢిల్లీ ఎయిమ్స్‌  కు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి 

హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి   సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు  అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ  లో చేరారు. అక్కడ సీఎంను పరీక్షించిన వైద్యులు కడుపులో ఇన్‌ఫెక్షన్‌ అయినట్లు గుర్తించారు. తాజాగా ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్‌  కు తరలించారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ  సూపరింటెండెంట్‌ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య …

Read More »

ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 సదస్సును భారత్ దేశంలో నిర్వహించేలా ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందాన్ని కల్గించిందని అన్నారు. భారతవిదేశాంగ విధానానికి ప్రపంచ వ్యాప్తంగా  తగిన ప్రాముఖ్యత పెరుగుతుంది. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం  పట్ల మన్మోహాన్ సింగ్ హర్షించారు. ఇతర దేశాల ఒత్తిడికి తలోగ్గకుండా …

Read More »

G-20 విందు… ఖర్గేకు అవమానం

G-20 సదస్సు సందర్భంగా రేపు శనివారం సాయంత్రం దేశ రాష్ట్రపతి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  దీనికి G-20 అతిథులతో పాటు  భారత్ కు చెందిన మాజీ ప్రధానులు.. కేంద్ర మంత్రులు.. వివధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క నేతకు కూడా ఆహ్వానం అందలేదు. కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో …

Read More »

కాంగ్రెస్ లో తుమ్మల చేరికకు బ్రేక్…ఆ క్లారిటీ వచ్చాకే కండువా మార్పు..!

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ …

Read More »

ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా..?.. వద్దా..?

ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్తలపై తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని వాడాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని లోక్ సభ మాజీ సెక్రటరీ …

Read More »

తెలంగాణలో ఎన్నికలు అప్పుడే..జమిలిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్..!

కేంద్రంలోని మోదీ సర్కార్ మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది..ఏకంగా లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు ఒకేసారి జరిగేలా జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యంగా దేశంలోనే మోదీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడం, మరోవైపు ఆయారాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగడం..అలాగే కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవడం, తెలంగాణ సీఎం …

Read More »

అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ

దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. దేశంలో ఉన్న ఎనిమిది జాతీయ పార్టీలు తమ ఆస్తులను తెలియజేశాయి. ఈ క్రమంలో 2021-22ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,829.16కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ సీపీఐ సీపీఎం బీఎస్పీ ఏఐటీసీ ఎన్ పీఈపీ పార్టీలు ఆస్తుల వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. అయితే ఈ ఎనిమిది పార్టీల్లో బీజేపీ ఆస్తులు అక్షరాల రూ.6,046.81కోట్లు.. కాంగ్రెస్ ఆస్తులు …

Read More »

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.  ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat